Tollywood Drugs Case: ఈడీ విచారణకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్

Tollywood Drugs Case: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తప్పలేదు. ఆమె కూడా ఈడీ ఎదుట ఈరోజు హైదరాబాద్ లో విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మరంగా విచారణ చేపడుతోంది. వరుసగా గడిచిన రెండు రోజుల్లో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మిలను విచారించిన అధికారులు తాజాగా స్టార్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ను విచారిస్తున్నారు. శుక్రవారం ఉదయం […]

Written By: NARESH, Updated On : September 3, 2021 12:57 pm
Follow us on

Tollywood Drugs Case: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు తప్పలేదు. ఆమె కూడా ఈడీ ఎదుట ఈరోజు హైదరాబాద్ లో విచారణకు హాజరయ్యారు. టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముమ్మరంగా విచారణ చేపడుతోంది. వరుసగా గడిచిన రెండు రోజుల్లో దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్ చార్మిలను విచారించిన అధికారులు తాజాగా స్టార్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ను విచారిస్తున్నారు.

శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh) హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు. మనీలాండరింగ్ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీఅధికారులు ఆరా తీయనున్నట్టు సమాచారం.

ఇప్పటికే టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ కేసును తెలంగాణ ఏసీబీ విచారించి సినీ ప్రముఖుల పాత్ర లేదని నిర్ధారించి డ్రగ్స్ విక్రేతలను అరెస్ట్ చేసింది. అయితే తాజాగా ఈ డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీ రంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈనెల 6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్ హాజరు కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ల కారణంగా తాను ఈడీ ఎదుట హాజరు కాలేనని.. తనకు కొంత గడువు కావాలని రకుల్ కోరారు.కానీ ఈడీ అధికారులు అందుకు నిరాకరించారు.

దీంతో మూడు రోజుల ముందుగానే ఈడీ విచారణకు రకుల్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు ఈ కేసులో రకుల్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈనెల 8న స్టార్ హీరో రానాను విచారించేందుకు ఈడీ సిద్ధమైంది.