దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 57,972 వద్ద.. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 17,267 వద్ద కొనసాగుతున్నాయి. ఓదశలో సెన్సెక్స్ 58 వేల మార్క్ ను దాటింది. గురువారం సూచీలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.07 ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయి.