Nagarjuna And Venkatesh: కొడుకు, అల్లుడు కోసం నాగార్జున, వెంకటేష్ చేసిన పని గొప్ప ఇది…

అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 9 వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జరగనున్నట్టుగా చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇక దానికి ముఖ్య అతిథులు గా నాగార్జున, వెంకటేష్ లు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : December 9, 2023 8:53 am

Nagarjuna And Venkatesh

Follow us on

Nagarjuna And Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనదైన రీతిలో సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదే క్రమంలో ఆయన పాన్ ఇండియన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన చందు మొండిటి డైరెక్షన్ లో తండేల్ అనే ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక దానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 9 వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జరగనున్నట్టుగా చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇక దానికి ముఖ్య అతిథులు గా నాగార్జున, వెంకటేష్ లు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది… అయితే నాగచైతన్య అటు వాళ్ళ నాన్నని, ఇటు వాళ్ళ మావయ్య వెంకటేష్ ని కలుపుతూ వాళ్ల చేతుల మీదుగా పూజ కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశ్యం తోనే ఇలా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వెంకీ, నాగ్ గత కొన్ని రోజులు గా సరిగ్గా మాట్లాడుకోవడం లేదని తెలుస్తుంది. అందుకే నాగ చైతన్య తన సినిమా ద్వారా ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ చేసుకొని సినిమా యూనిట్ మొత్తం షూట్ కోసం రెడీగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది శ్రీకాకుళం జిల్లాలోని గార మండలం లోని మత్స లేశం అనే ఒక ఊరు కి చెందిన ఒక యదార్ధ స్టోరీ గా తెలుస్తుంది.

ఇక ఈ ఊరు నుంచి కొంతమంది 2018 వ సంవత్సరంలో వాళ్ళ జీవనోపాధి నిమిత్తం గుజరాత్ కి వెళ్లి నివసించారు. ఇక అక్కడ వాళ్ళు చేపల వేట కోసం సముద్ర లోకి వెళ్ళగా అక్కడి నుంచి వాళ్లు అనుకోకుండా పాకిస్తాన్ కి వెళ్తారు. దాంతో పాకిస్తాన్ పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇక అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చొరవతో వాళ్ళని రిటర్న్ తీసుకువచ్చారు. ఇక ఇదే కథని చందు మొండేటి ఒక మంచి లవ్ స్టోరీ ని ఆడ్ చేసి ఈ సినిమా స్టోరీ ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా లో కొన్ని ట్విస్ట్ లను ఆడ్ చేసి తెరమీదికి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్య పక్కన హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది.

ఇక ఇప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో లవ్ స్టోరీ అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి వీళ్ళిద్దరి జోడిని మనం తెర పైన చూడబోతున్నాం అయితే ఈ సినిమాతో భారీ హిట్ కొట్టాలని నాగచైతన్యతో పాటు చందు మొండేటి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది…