ప్రముఖ నటికి షాక్.. దారుణంగా మోసపోయింది..

సినీ సెలబ్రెటీలు నమ్మి మోసం పోవడం అనేది సాధారణమైన పనే. ఈ మధ్యనే టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు ఎవరినో నమ్మి లక్ష రూపాయలు ఇచ్చాడు. అతడు కరోనా వ్యాక్సిన్లు ఇస్తానని మోసం చేశాడు. ఇప్పుడు అదే కోవలో మరో టాలీవుడ్ ప్రముఖ నటి కూడా మోసపోయింది. తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో తల్లి పాత్రల్లో ఒదిగిపోయే సీనియర్ నటి పవిత్ర లోకేష్. అందం, చందం,పద్ధతిగా ఉండే ఈమె ఇటీవల దారుణంగా మోసపోయింది. ఆమె సన్నిహితుడే ఆమెకు […]

Written By: NARESH, Updated On : August 3, 2021 7:33 pm
Follow us on

సినీ సెలబ్రెటీలు నమ్మి మోసం పోవడం అనేది సాధారణమైన పనే. ఈ మధ్యనే టాలీవుడ్ బడా నిర్మాత సురేష్ బాబు ఎవరినో నమ్మి లక్ష రూపాయలు ఇచ్చాడు. అతడు కరోనా వ్యాక్సిన్లు ఇస్తానని మోసం చేశాడు. ఇప్పుడు అదే కోవలో మరో టాలీవుడ్ ప్రముఖ నటి కూడా మోసపోయింది.

తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో తల్లి పాత్రల్లో ఒదిగిపోయే సీనియర్ నటి పవిత్ర లోకేష్. అందం, చందం,పద్ధతిగా ఉండే ఈమె ఇటీవల దారుణంగా మోసపోయింది. ఆమె సన్నిహితుడే ఆమెకు షాక్ ఇచ్చినట్టు తెలిసింది.

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవిత్ర లోకేష్ బిజీగా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే ఆమెను నమ్మించి ఆమె మేనేజర్ నట్టేట ముంచినట్టుగా తెలిసింది.ఆమె మేనేజర్ ఆర్థిక లావాదేవీల్లో మోసం చేసినట్లు తెలుస్తోంది.

దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లింపులు చేయలేదని.. దీంతో ప్రభుత్వం నుంచి పవిత్రా లోకేష్ కు నోటీసులు అందాయని బీటౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో సినీ సెలబ్రెటీలు ఎందరో ఇటువంటి మోసాలకు గురయ్యారు.కెరీర్ లో బిజీగా ఉండి ఆర్థిక లావాదేవీలను మేనేజన్లను నమ్మి అప్పగించి కోట్లు కోల్పోయిన సెలబ్రెటీల ఉదంతాలెన్నో జరిగాయి. ఇప్పుడు పవిత్ర లోకేష్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం.

ఆ మధ్య అనసూయ కూడా జీఎస్టీ పన్నులు, ఆదాయా వ్యవహారాలన్నీ తన మేనేజర్ చూసుకునేవాడని.. కానీ తనకు నోటీసులు వచ్చాక మోసపోయానని తెలిసి వాటిని కట్టేశానని పేర్కొంది.

ఇలా ఎందరో సెలబ్రెటీలు కొందరు మేనేజర్లు చేసిన మోసాలకు అప్పులపాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పు పవిత్ర లోకేష్ కూడా అలానే మోసపోయింది.