Pushpa 2: పుష్ప 2లో ఆ సీన్ మామూలుగా ఉండదు… అసలు మేటర్ లీక్ చేసిన దేవిశ్రీ

పుష్ప 2 గురించి లీక్ అవుతున్న ఒక్కో విషయం హైప్ మరింత పెంచేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ మరో లీక్ చేశాడు. సినిమాలో ఓ కీలక సన్నివేశం గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు.

Written By: NARESH, Updated On : November 21, 2023 11:18 am

Pushpa 2

Follow us on

Pushpa 2: పుష్ప 2 చిత్రంపై ఇండియా వైడ్ అంచనాలున్నాయి. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కి నార్త్ లో కూడా బాగా ఫ్యాన్ బేస్ పెరిగింది. పుష్ప 2 రికార్డు ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు. వెయ్యి కోట్ల రూపాయల బాక్సాఫీస్ టార్గెట్ తో పుష్ప 2 తెరకెక్కుతుంది. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 350 కోట్లని సమాచారం. అంటే పార్ట్ 1 బడ్జెట్ కంటే మూడింతలు అని చెప్పొచ్చు. పుష్ప 2కి ఉన్న డిమాండ్ రీత్యా బడ్జెట్ ఎంతైనా రికవరీ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఇక పుష్ప 2 గురించి లీక్ అవుతున్న ఒక్కో విషయం హైప్ మరింత పెంచేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ మరో లీక్ చేశాడు. సినిమాలో ఓ కీలక సన్నివేశం గురించి క్రేజీ కామెంట్స్ చేశాడు. దేవిశ్రీ మాట్లాడుతూ… పుష్ప 2 స్క్రీన్ ప్లే ఉత్కంఠ రేపుతుంది. నెక్స్ట్ ఏమవుతుందనే థ్రిల్ ఫీల్ అవుతాడు ప్రేక్షకుడు. ఇక అల్లు అర్జున్ గంగమ్మతల్లి గెటప్ లో జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశం సినిమాకే హైలెట్ గా ఉంటుందన్నారు. అంతకంటే ఎక్కువ చెప్పకూడదని ఆయన అన్నారు.

రాయలసీమలో గంగమ్మ జాతరకు చరిత్ర, విశిష్టత ఉంది. ఈ జాతరలో అమ్మవారి వేషం కట్టిన అల్లు అర్జున్ చెలరేగిపోతాడట. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందని టాక్. ఇదే విషయాన్ని ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ పరోక్షంగా హింట్ ఇచ్చాడని పలువురు భావిస్తున్నారు. పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చిత్ర విడుదల తేదీ కూడా ప్రకటించారు.

2024 ఆగస్టు 15న పుష్ప ది రూల్ విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. అనసూయ, సునీల్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా పుష్ప మూవీలో నటనకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఈ గౌరవం దక్కిన మొట్టమొదటి తెలుగు నటుడిగా రికార్డులకు ఎక్కాడు. దేవిశ్రీ సైతం పాటలకు గాను జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.