కొత్త అవతారంలో తమన్నా ‘ఆహా’ అనిపిస్తుందా?

మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేటు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోందామె. వయసు పెరిగినా ఆమె జోరు తగ్గడం లేదు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు స్పెషల్‌ సాంగ్స్‌, గెస్ట్‌ రోల్స్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది. ‘ది నవంబర్స్‌ స్టోరీ’ అనే తమిళ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోన్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో మరో […]

Written By: admin, Updated On : June 25, 2020 2:38 pm
Follow us on


మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేటు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోందామె. వయసు పెరిగినా ఆమె జోరు తగ్గడం లేదు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు స్పెషల్‌ సాంగ్స్‌, గెస్ట్‌ రోల్స్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది. ‘ది నవంబర్స్‌ స్టోరీ’ అనే తమిళ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోన్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన తమన్నా.. ఓ టాక్‌ షోను హోస్ట్‌ చేసేందుకు రెడీ అయినట్టు సమచారం. దక్షిణాదితో పాటు హిందీలో నటించి అన్ని చోట్లా తనకంటూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పరచుకున్న తమన్నాతో ఓ టాక్‌ షో చేయించేందుకు బడా నిర్మాత అల్లు అర్జున్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ‘ఆహా’ పేరుతో ఆయన ప్రారంభించిన తెలుగు ఓటీటీ అంతగా హిట్‌ కాలేదు. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, సన్‌ నెక్ట్స్‌ వంటి పాపులర్ ప్లాట్‌ఫామ్స్‌తో పోటీలో వెనుకబడింది. దాంతో, ‘ఆహా’ను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి అర‌వింద్ ప‌లువురు ద‌ర్శకులు, రచయితలను రంగంలోకి దింపుతున్నాడు. యువ హీరోయిన్స్‌తో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే హెబ్బా ప‌టేల్, బిందు మాధవి ఓ సిరీస్‌లో నటించారు. మరో యువ నటి పాయ‌ల్ రాజ్‌పుత్ ‘ఆహా’లోకి రానుందట.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

ఈ క్రమంలో వైవిధ్యంగా డిజైన్‌ చేసిన ఓ టాక్‌ షోకు తమన్నాకు హోస్ట్‌ గా ఎంచుకున్నట్టు సమాచారం. ఈ షోలో ఇతర సెలబ్రిటీలు కూడా పాల్గొంటారట. మెగా హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌తో పాటు రవితేజ లాంటి నటులతో ఆమె ముచ్చటిస్తుందనట. దాంతో షో హిట్టవడంతో పాటు ‘ఆహా’కు మంచి ప్రమోషన్‌ లభిస్తుందని అల్లు అరవింద్‌ ప్లాన్‌. కాగా, తమన్నా తెలుగు తాజా చిత్రం ‘దటీజ్‌ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రం కూడా చేస్తోంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘బోలే చుడియా’ షూటింగ్ పార్ట్‌ పూర్తయింది.