భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ కరోనా వైరస్ ని ఎలాగైనా సరే అడ్డుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా కీలకమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని సినిమాలు, సినిమా షూటింగులు బంద్ పాటిస్తున్నాయి. ఆ ప్రభావం రోజు వారి సినీ కార్మికుల ఫై బాగా పడింది. ఇప్పటికే వారు తమ ఉపాధిని కూడా కోల్పోయారు.
ఇలాంటి ఆపత్కర సమయం లో సినీ కార్మికులు పడే బాధలు చూడలేక సీనియర్ తమిళ హీరో శివ కుమార్ తన కొడుకులైన హీరో సూర్య , హీరో కార్తీ లతో కలిసి ఒక మంచి పని చేసాడు. ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ అఫ్ సౌత్ ఇండియా ( f e f s i ) కార్మికుల సంక్షేమం కోరుతూ 10 లక్షల భారీ విరాళం అందజేయడం జరిగింది. దాంతో వీరి యొక్క దాన గుణాన్ని కోలీవుడ్ బహుదా ప్రశంసిస్తోంది.
అలాగే ఈ విపత్కర సమయం లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఓ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకొని సినీ వర్గాల్లో కొందరికి సహాయం చేయాలని సంకల్పించాడు. అనుకోండి ప్రశంసిస్తూ తడవుగా ప్రకాష్ రాజ్… తన పొలంలో పని చేస్తున్న వారితో పాటు, తన ఇంటిలో పనిచేస్తున్న వారికి , ప్రొడక్షన్ కంపెనీలో పనిచేసే వారికి , ఫౌండేషన్ ఉద్యోగులకు మరియు వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల వరకు జీతాలు ముందుగానే ఇచ్చేశారు. అంతేకాకుండా తాను ప్రస్తుతానికి నటిస్తున్నటువంటి సినిమాలలో పని చేస్తున్న రోజు వారీ వేతన జీవులకు కూడా సగం జీతం ఇవ్వాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించు కొన్నాడట …
Great lives in the hearts of public