Suma Adda: యాంకర్ సుమకు చేతబడి చేసిన సీరియల్ నటుడు

ఆమెకు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు. అదే సమయంలో కొడుకును హీరోగా పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే లిమిటెడ్ గా షోలు చేస్తున్నారు. ప్రస్తుతం సుమ అడ్డా పేరుతో ఒక టాక్ షో చేస్తుంది. ఈ షోకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ దక్కింది. కాగా సుమ అడ్డా షో లేటెస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా సీరియల్ నటులు మానస్, కావ్య, శోభిత శెట్టి, రవి కృష్ణ వచ్చారు. వీరితో సుమ సంబాషణలు సరదాగా సాగాయి.

Written By: Shiva, Updated On : June 19, 2023 10:16 am

Suma Adda

Follow us on

Suma Adda: స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా ఆమె తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్నారు. బుల్లితెరను ఏలుతున్నారు. పదుల సంఖ్యలో షోలు చేసిన సుమ, వందల ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇతర సినిమా ఈవెంట్స్ కి ప్రాతినిధ్యం వహించారు. సమయస్ఫూర్తి, భాషలపై పట్టు ఆమెను ప్రత్యేకంగా మార్చాయి. అందుకే ఆమెకు తిరుగు లేకుండా పోయింది. ఈ మధ్య సుమ జోరు తగ్గింది. ఆమె షోలు తగ్గించేశారు.

ఆమెకు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటున్నారు. అదే సమయంలో కొడుకును హీరోగా పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. అందుకే లిమిటెడ్ గా షోలు చేస్తున్నారు. ప్రస్తుతం సుమ అడ్డా పేరుతో ఒక టాక్ షో చేస్తుంది. ఈ షోకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదరణ దక్కింది. కాగా సుమ అడ్డా షో లేటెస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా సీరియల్ నటులు మానస్, కావ్య, శోభిత శెట్టి, రవి కృష్ణ వచ్చారు. వీరితో సుమ సంబాషణలు సరదాగా సాగాయి.

సాయి కృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష మూవీలో క్షుద్ర పూజలు చేసే పాత్రలో కనిపించాడు. అతడు మెయిన్ విలన్ రోల్ చేశాడు. ఆ పాత్రను ఉద్దేశించి సుమ ఇప్పుడు నాకు దెయ్యం పట్టింది అని అంటుంది. ఆమె మాటకు కౌంటర్ గా మీకు బై బర్త్ దెయ్యం పట్టిందని రవికృష్ణ అన్నాడు. ఇక విరూపాక్ష మూవీలో చేసినట్లు రవికృష్ణ చేతబడి చేశాడు. చేతబడి గురైన అమ్మాయిగా సుమ విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. సుమ అడ్డా ప్రోమో వైరల్ అవుతుంది.

సుమ అడ్డాకు ప్రతి వారం సెలెబ్రిటీలు వచ్చి సందడి చేస్తున్నారు. ఇటీవల సుమ యాంకరింగ్ కి గుడ్ బై చెబుతున్నారనే ప్రచారం జరిగింది. పిల్లల కెరీర్ మీద ఫోకస్ పెట్టిన ఆమె పూర్తి టైం అందుకు కేటాయిస్తున్నారట. ఆ మధ్య భర్తతో రాజీవ్ కనకాలతో విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది. కొన్నాళ్ళు వీరు విడివిడిగా ఉన్నారు. అనంతరం జంటగా కనిపించి విడాకుల వార్తలకు చెక్ పెట్టారు.