1500 కోట్లకు కోల్పోనున్న చిత్ర పరిశ్రమ

కరోనా వైరస్ తో దేశీయ మార్కెట్ లన్ని దారుణంగా దెబ్బతిన్నాయి . భారత్ దేశం లో మద్యం తరవాత ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టె సినీ పరిశ్రమ కూడా ఇపుడు సంక్షోభం లో పడింది. తెలంగాణా లో మార్చ్ పదిహేనవ తారీకు నుంచి లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతబడింది. థియేటర్లు సైతం అదే మార్చ్ 15వ తేదీ నుండి మూతబడే ఉన్నాయి. పూర్తి అయిన సినిమాల విడుదల వాయిదాపడగా, చిత్రీకరణలో […]

Written By: admin, Updated On : March 24, 2020 8:11 pm
Follow us on

కరోనా వైరస్ తో దేశీయ మార్కెట్ లన్ని దారుణంగా దెబ్బతిన్నాయి . భారత్ దేశం లో మద్యం తరవాత ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టె సినీ పరిశ్రమ కూడా ఇపుడు సంక్షోభం లో పడింది. తెలంగాణా లో మార్చ్ పదిహేనవ తారీకు నుంచి లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతబడింది. థియేటర్లు సైతం అదే మార్చ్ 15వ తేదీ నుండి మూతబడే ఉన్నాయి. పూర్తి అయిన సినిమాల విడుదల వాయిదాపడగా, చిత్రీకరణలో ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. దీంతో లాక్ డౌన్ సమయం ముగిసేనాటికి నష్టాలు 1500 కోట్లకు పైనే ఉంటాయని అంటున్నారు సినీ నిర్మాతలు.

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లో చాలా సినిమాలు విడుదల వాయిదాపడి ఆగి పోయాయి. ఎప్పుడు విడుదల అవుతాయో తెలీదు .ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి. కనీసం ఇంకో వారం ఆగితేనే గాని తరవాత పరిస్థితులు తెలీవు. ఇలా మూడు వారాలు బిజినెస్ లేకపోవడంతో మిగతా పరిశ్రమలు అయితే లాక్ డౌన్ పీరియడ్ ముగిస్తే డిమాండ్ అండ్ సప్లై ఫార్ములాతో కోలుకునే వీలుంది, కానీ సినీ ఇండస్ట్రీ మాత్రం అలా కాదు. సీజన్ బట్టి వసూళ్లు ఉంటాయి. పండుగలు అప్పుడు ఒక స్థాయిలో ఉంటాయి ఇక సమ్మర్ సీజన్ లో ఇంకోలా ఉంటాయి . ఆ లెక్కన సమ్మర్ సీజన్ అంతా ప్రేక్షకులకు దూరంగా థియేటర్ లు ఉంటే వచ్చే నష్టాలను ఊహించలేం Nature is unseen enemy .