Shraddha Das : ‘శ్రద్ధ’గా అందాలు పంచి షాకిచ్చింది.. వైరల్ అవుతోన్న ఫొటోలు

తెలుగులో లాభం లేదనుకొని బాలీవుడ్ లో ప్రయత్నించింది. చాయ్ షాయ్ బిస్కెట్స్, లక్కీ కబూతర్, దిల్ తో బచ్చా హై జీ, లాహోర్ వంటి సినిమాల్లో నటించింది. అక్కడ కూడా తెలుగులో వచ్చిన ఫలితమే రావడంతో.. కన్నడలో ప్రయత్నించింది. హోస ప్రేమ పురాణ, కోటి గొబ్బ అనే సినిమాల్లో మెరిసింది. ఇక లాభం లేదనుకొని ప్రత్యేక గీతాల్లో నటించడం ప్రారంభించింది.

Written By: NARESH, Updated On : March 8, 2024 10:50 pm
Follow us on

Shraddha Das : అప్పుడెప్పుడో అల్లరి నరేష్ హీరోగా సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది శ్రద్ధా దాస్. ఆ సినిమా అంతగా ఆడక పోయినప్పటికీ.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందిన ఆర్య -2 సినిమాతో స్టార్ డం అందుకుంది. ప్రభాస్ హీరోగా రూపొందిన డార్లింగ్ సినిమాలోనూ ప్రత్యేక పాత్రలో శ్రద్ధా దాస్ ఆకట్టుకుంది.. అయినప్పటికీ అవేవీ ఆమె కెరియర్ కు హెల్ప్ కాలేదు. ఇలా అడపా దడపా దాదాపు 15 తెలుగు సినిమాల్లో నటించింది. అందాన్ని ఒలకపోసే పాత్రల్లో నటించినప్పటికీ.. శ్రద్ధ కెరియర్ ముందుకు సాగలేదు.

బాలీవుడ్ లోనూ..

తెలుగులో లాభం లేదనుకొని బాలీవుడ్ లో ప్రయత్నించింది. చాయ్ షాయ్ బిస్కెట్స్, లక్కీ కబూతర్, దిల్ తో బచ్చా హై జీ, లాహోర్ వంటి సినిమాల్లో నటించింది. అక్కడ కూడా తెలుగులో వచ్చిన ఫలితమే రావడంతో.. కన్నడలో ప్రయత్నించింది. హోస ప్రేమ పురాణ, కోటి గొబ్బ అనే సినిమాల్లో మెరిసింది. ఇక లాభం లేదనుకొని ప్రత్యేక గీతాల్లో నటించడం ప్రారంభించింది. ప్రస్తుతం తెలుగులో పారిజాత పర్వం అనే సినిమాలో ప్రత్యేక గీతంలో నటిస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఆమధ్య ఈటీవీలో ప్రసారమైన ఢీ అనే డ్యాన్స్ రియాల్టీ షో లో న్యాయ నిర్ణేత గా శ్రద్ధ వ్యవహరించింది.

ఉన్న వాటిని సద్వినియోగం చేసుకుని..

అవకాశాలు లేకపోయినప్పటికీ.. ఉన్నవాటిని సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధా దాస్ తన వెండి తెర ప్రయాణాన్ని సాగిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధ.. ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు శ్రీలంక పర్యటనలో ఉంది. అందులో నదిలో తన స్నేహితురాలితో కలిసి పడవ ప్రయాణం చేస్తోంది. తెల్లని ఈత దుస్తులు ధరించి అభిమానుల మతులు పోగొడుతోంది. అసలే అరేబియన్ గుర్రం లాగా ఉండే శ్రద్ధ.. ఈత దుస్తులు ధరించి అందాలు ఒలకబోయడంతో కుర్ర కారు తట్టుకోలేకపోతున్నారు. సరిగ్గా మహిళా దినోత్సవం రోజు ఆమె ఈ ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..