మన తెలుగు యువ హీరోల్లో శర్వానంద్ భిన్నంగా ఆలోచిస్తాడు. కథ కొత్తగా ఉండాలి దానికి తగ్గట్టు .. తన పాత్ర వైవిధ్యభరితంగా ఉండాలి అనుకొంటాడు..అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఇటీవల శర్వానంద్ సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో ఆయన కథల ఎంపిక విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది..ఆ క్రమంలో ఇపుడు రెండు ప్రాజెక్ట్ లు ఒకే చెప్పాడని తెలుస్తోంది.
‘ఆర్ఎక్స్ 100’ వంటి సూపర్ హిట్ మూవీ తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి ఆ చిత్ర నిర్మాతకి
పెట్టుబడి మీద పది రెట్లకు మించి లాభాలు తెచ్చి పెట్టాడు . ఆ దర్శకుడితో సినిమా చేయడానికి శర్వానంద్ రాదు అవుతున్నాడు.ఈ దర్శకుడు ఏడాది కిందటే ‘మహాసముద్రం’ అనే పేరుతో తన రెండో సినిమాకు స్క్రిప్టు రెడీ చేసేశాడు. కానీ దానికి నిర్మాతను ఎంపిక చేసుకోవడం లో మాత్రం ఇబ్బందులు పడుతున్నాడు.
ఐతే ఎట్టకేలకు దర్శకుడు అజయ్ భూపతి నిరీక్షణ ఫలించిందని. తెలుస్తోంది. శర్వా నంద్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఒక పెద్ద నిర్మాత ఓకే అన్నాడట.. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని నిర్మించి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అనిల్ సుంకర ఈ చిత్రాన్నినిర్మించ బోతున్నాడు అని తెలుస్తోంది .
అదలా ఉండాగా శర్వానంద్ మరో సినిమా అంగీకరించడం జరిగింది. ప్రముఖ డాన్స్ మాస్టర్ రాజు సుందరం దర్శకుడిగా ఒక సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా ఈ సినిమాలో కథానాయకుడిగా శర్వానంద్ ను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా తమిళంలో నిర్మితం కానుంది. ‘జర్నీ’ తరువాత తమిళంలో శర్వానంద్ చేస్తున్న రెండో సినిమా ఇది. తమిళంతో పాటు తెలుగులోను విడుదల అయ్యే ఈ చిత్రం అన్నీ కుదిరితే మే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగును జరుపుకో నుంది.