2020 లో తెలుగు సినిమా పెద్ద చిత్రాలతో కళకళ లాడి పోతుందని అంతా భావించారు. ఆరంభంలో వచ్చిన `అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు ` చిత్రాలు అద్భుత విజయాన్ని సాధించి , వసూళ్ల మోత మోగించాయి . ఇక అదే ఊపులో 2020లో తెలుగు సినిమా మోతెక్కిపోతుందని సినీ రంగం ఆశించింది . ‘ఆర్ఆర్ఆర్’తో పాటు, `ఆచార్య ` , బన్నీ సుకుమార్ కాంబో మూవీ , ప్రభాస్ ,పూజా హెగ్డే ల భారీ చిత్రం …ఇలా ఎన్నో భారీ చిత్రాలు ఈ ఏడాది సందడి చేయాల్సి ఉంది. కానీ చూస్తుండగానే కరోనా ఎఫెక్ట్ తో పరిస్థితులు మారిపోయాయి.
ఇక ప్రారంభం కావాల్సిన చిత్రాల పరిస్థితి కూడా అలాగే ఉంది. అంతా అనుకున్న ప్రకారం జరిగినట్టయితే మహేష్ కొత్త చిత్రం ఈపాటికి పట్టాలెక్కాల్సింది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని ఆరంభించేందుకు నిర్మాత , దర్శకులు రెడీ గా ఉన్నారు. నిజానికి ఆ చిత్రాన్ని ఈ ఏడాదే పూరి చేయాలను కొన్నారు. కానీ అది కూడా ఈ ఏడాదికి పూర్తి కాదు.
ఇవన్నీ అలా సందిగ్ధం లో కొట్టుమిట్టాడు తుంటే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ మాత్రం ఈ సంవత్సరం వెలుగు చూడటం ఖాయం అనిపిస్తోంది. ఇప్పటికే చాలా వరకు పూర్తయిన ఈ చిత్రం సాధారణ పరిస్థితులు వచ్చాక రెండు నెలల్లో రెడీ అయిపోతుంది కాబట్టి రూట్ క్లియర్ అయ్యింది.