బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన సూపర్ స్టార్

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ మూవీ ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ మూవీ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతీచోట సరికొత్త రికార్డులను తిరగరాసిన సంగతి తెల్సిందే. అదేవిధంగా బుల్లితెరపై కూడా బాహుబలి సరికొత్త రికార్డు సృష్టించింది. ‘బాహుబలి-2’ అత్యధికంగా 22.7టీఆర్పీ సంపాదించి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. అయితే తాజాగా ఈ రికార్డును మహేష్ సినిమా దాటేసి ఆల్ టైం టాప్ ప్లేస్ లో నిలిచింది. మహేష్ బాబు తాజా […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 3:47 pm
Follow us on


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ మూవీ ఎన్నో రికార్డులను సృష్టించింది. ఈ మూవీ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతీచోట సరికొత్త రికార్డులను తిరగరాసిన సంగతి తెల్సిందే. అదేవిధంగా బుల్లితెరపై కూడా బాహుబలి సరికొత్త రికార్డు సృష్టించింది. ‘బాహుబలి-2’ అత్యధికంగా 22.7టీఆర్పీ సంపాదించి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. అయితే తాజాగా ఈ రికార్డును మహేష్ సినిమా దాటేసి ఆల్ టైం టాప్ ప్లేస్ లో నిలిచింది.

మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’ 2020 సంక్రాంతి కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. టాలీవుడ్ వసూళ్లలో ఈ మూవీ 4వ స్థానంలో నిలిచింది. ‘సరిలేరునీకెవ్వరు’ మూవీ శాటిలైట్ రైట్స్ సన్ నెట్వర్క్స్ దక్కించుకుంది. తాజాగా ఈ మూవీని జెమినీ టీవీ లో ప్రసారం చేయగా 23.4 టీఆర్పీ సాధించింది. గడిచిన 15ఏళ్లలో ఏ సినిమాకి బుల్లితెరపై ఇంత టీఆర్పీ రాలేదని.. ఆల్ టైం టాప్ లో ఈ మూవీ నిలిచిందని జెమిని ప్రకటించింది.

గతంలో బాహుబలి-2కి టీఆర్పీ 22.7 వచ్చింది. ఈ టీఆర్పీని ‘సరిలేరునీకెవ్వరు’ దాటేసింది. దీంతో ‘బాహుబలి’ బుల్లితెరపై క్రియేట్ చేసిన రికార్డును మహేష్ మూవీ క్రాస్ చేసినట్టయింది. ఈ మూవీ తర్వాత మహేష్ తదుపరి మూవీపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే మహేష్ తదుపరి మూవీ పర్శురాం దర్శకత్వంలో ఉండనుందని ప్రచారం జరుగుతుంది. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం షూటింగ్ లన్నీ వాయిదా పడ్డాయి. దేశంలో లాక్డౌన్ ఎత్తేశాక మహేష్ మూవీపై పూర్తి క్లారిటీ రానుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే..