Samantha: పిల్లల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత

సమంత సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాతో తన అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంది. ఈమె తన ట్రీట్మెంట్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

Written By: Neelambaram, Updated On : November 23, 2023 3:01 pm
Follow us on

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈగ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత తన రేంజ్ ను పెంచుకుంది. రీసెంట్ గా ఖుషీ సినిమాతో మరోసారి తన సత్తా చాటింది అమ్మడు. అయితే గత కొన్ని రోజుల నుంచి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. శాకుంతల సినిమాకు డబ్బింగ్ కూడా బెడ్ మీద పడుకునే చెప్పింది సామ్. అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటానని తెలిపింది. ఇక ఇటీవల భూటాన్ వెళ్లినటువంటి సామ్ అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టిందట.. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?

సమంత సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాతో తన అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంది. ఈమె తన ట్రీట్మెంట్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. ఇకపోతే తాాజాగా సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటి అనుకుంటున్నారా. సమంత పిల్లల విషయంలో ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ అమ్మడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు వైద్య చికిత్సలు అందించడమే కాకుండా వారి బాగోగులు కూడా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చూసుకుంటున్నారు.

గత 11 సంవత్సరాలుగా ప్రత్యూష ఫౌండేషన్ ను నడుపుతున్న విషయం తెలిపింది. ఇలా దీని ద్వారా ఎంతో మందికి సహాయం గా నిలిచిన సమంత ప్రస్తుతం మరో ఇద్దరు చిన్నారులకు బంగారు భవిష్యత్తు అందించడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. ఈమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోబోతున్నారని తెలుస్తోంది. దత్తత తర్వాత వారి పూర్తి బాధ్యతలను సమంతనే చూసుకుంటుందట. ఇలా సమంత పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి నచ్చుతుంది. ఇన్ని రోజులు చైతన్య విషయంలో తిట్టిన వారు కూడా ఇప్పుడు కొనియాడుతున్నారట. కానీ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి చూడాలి సమంత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవడం నిజమా కాదా అనేది.