‘మెగా’ నటుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్ బైక్పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్కు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలో వెళ్లినట్లు తెలుస్తోంది. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, చికిత్స నిమిత్తం సాయిధరమ్ తేజ్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
బైక్పై వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బైక్ను నియంత్రించలేక అదుపుతప్పి కిందపడిపోయినట్లు మాదాపూర్ సీఐ తెలిపారు. అంతర్గతంగా ఏమైనా గాయాలు అయ్యాయా?అన్న అనుమానంతో సాయిధరమ్ తేజ్కు వైద్యులు స్కాన్ చేస్తున్నారని, ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు..
హాస్పిటల్ కు చేరుకుంటున్న సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు వైష్ణవ తేజ్,పవన్ కళ్యాణ్, హీరో సందీప్ కిషన్,నిహారిక,వరుణ్ తేజ్.. స్పృహలో లేడని.. ప్రమాదం ఏమి లేదని చెప్పిన పవన్ కళ్యాణ్.
మెరుగైన చికిత్స నిమిత్తము సాయి ధరమ్ తేజ్ ను అపోలో హాస్పిటల్ కు తరలింపు…. సాయిధరమ్ తేజ్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. సేఫ్ అని ఎముకలు విరిగాయని తెలిపారు.

