PKSDT BRO Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ని ఖారారు చేసి కాసేపటి క్రితమే ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది, ముఖ్యంగా మోషన్ పోస్టర్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అదిరిపోయింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన దీని గురించే చర్చించుకుంటున్నారు.
జులై 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఇక వారానికి ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందట.పవన్ కళ్యాణ్ ఈ చిత్రం దేవుడిగా నటిస్తున్నాడు. సాయి ధరమ్ ఇందులో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి గా కనిపించబోతున్నాడు.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ కి ఇది రీమేక్, అక్కడ దర్శకత్వం వహించిన సముద్ర ఖని, తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి ముందు సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ జరిగి చాలా సీరియస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మెరుగైన వైద్యం వల్ల ఆయన సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు కానీ, ఆ గొంతు బాగా దెబ్బతినింది. ఒక్కో డైలాగ్ పలకడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ‘విరూపాక్ష’ చిత్రం చూస్తే అర్థం అవుతుంది. అప్పుడు త్రివిక్రమ్ ఈ సినిమాని పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ తో తీద్దాం అనుకున్నప్పటికీ సాయి ధరమ్ తేజ్ పరిస్థితి చూసి వేరే హీరో ని తీసుకునే ఆలోచనలో ఉండేవాడు.
ఆ క్రమం లో నితిన్ మరియు రామ్ వంటి హీరోలను అనుకున్నారు. వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చెయ్యబోతున్నారు అనే విషయం తెలుసుకున్న సాయి ధరమ్ తేజ్, నాకు ఇప్పుడు అంతా బాగా ఉంది, నేను ఈ చిత్రాన్ని చేస్తాను అని ముందుకొచ్చాడు. సాయి ధరమ్ తేజ్ లో ఉన్న నమ్మకాన్ని గమనించి పవన్ కళ్యాణ్ కూడా అందుకు ఒప్పుకున్నాడు.అలా ఈ చిత్రం నితిన్ / రామ్ నుండి సాయి ధరమ్ తేజ్ చేతికి చేరింది.