Site icon OkTelugu

Telugu States Internet Speed: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదిరిపోయే న్యూస్..ఇకపై ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉండబోతుందంటే..

Telugu States Internet Speed

Telugu States Internet Speed

Telugu States Internet Speed: నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోతోంది. క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి.. దీంతో ఇంటర్నెట్ వాడకం గతంతో పోల్చి చూస్తే కొన్ని వందల రెట్లు పెరిగింది. స్మార్ట్ ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లు రావడం.. ఇంటర్నెట్ ఆధారంగానే మనిషి మనుగడ సాగిపోతు ఉండడం.. కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావడంతో.. అంతర్జాలం మీద ఆధారపడడం పెరిగిపోతోంది.

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతే సహజంగానే కేబుల్స్ మీద ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. మనకు శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ వస్తున్నప్పటికీ.. కేబుల్స్ ద్వారానే ఆయా దేశాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది.. సముద్రాలలో ఇప్పటికే అత్యంత కీలకమైన కేబుల్ అమర్చారు. వాటి ద్వారానే ప్రపంచానికి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు కూడా వేగంగా ఇంటర్నెట్ వాడు ఎందుకు ఈ కేబుల్స్ తోడ్పడుతున్నాయి.

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యంలో కేబుల్ మీద ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడానికి అడుగులు పడుతున్నాయి.. ఇంటర్నెట్ ఆధారంగా అన్ని పనులు సాగుతున్న నేపథ్యంలో.. కేబుల్ వ్యవస్థను మరింత పటిష్టం చేయబోతున్నారు. ఇందులో భాగంగానే మన దేశం తూర్పు తీరాన్ని ఆగ్నేయ ఆసియాతో కలిపే పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అత్తిపెద్దదైన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యవస్థకు సింగపూర్ లోని లైట్ స్మార్ట్ సంస్థ.. మైక్రోసాఫ్ట్.. సింగ్ టెల్.. టాటా కమ్యూనికేషన్ వంటి సంస్థలతో ఏర్పాటైన కన్సర్షియం ఐ 2 సి ప్రాజెక్ట్ ఏర్పాటు చేసింది. సుమారు 3600 కిలోమీటర్ల పొడవుతో ఈ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేబుల్ మచిలీపట్నం.. దక్షిణ చెన్నై.. సింగపూర్.. మలేషియాను కలిపేస్తుంది.

ప్రస్తుతం ఉపయోగిస్తున్న కేబుల్ వ్యవస్థ పాతది.. కొత్త కేబుల్ వ్యవస్థకు హై పెర్ఫార్మన్స్ కంప్యూటింగ్ వంటి వాటిని జత చేశారు. ఇది భవిష్యత్ అవసరాలను సులభంగా తీర్చగలుగుతుంది.. అత్యంత వేగంగా డేటా కనెక్టివిటీ అందిస్తుంది. ఇప్పుడున్న వేగంతో పోల్చి చూస్తే 15% అధికంగా స్పీడ్ ఉంటుంది.

ఇంటర్నెట్ కేబుల్స్ మొత్తం గతంలో ముంబై పశ్చిమ తీర నగరాల్లోనే ల్యాండ్ అయి ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం.. ఇటీవల ఇరాన్, అమెరికా యుద్ధం సాగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు ఎంచుకున్నారు. అందువల్లే తూర్పు తీర ప్రాంతంలోని మచిలీపట్నం నుంచి హైదరాబాద్ నగరానికి.. అక్కడ నుంచి ముంబై నగరానికి నూతన భూగర్భ ఫైబర్ మార్గాలను ఏర్పాటు చేయబోతున్నారు.

Exit mobile version