Rishab Shetty: ‘జై హనుమాన్’ లో హీరోగా ‘కాంతారా’ రిషబ్ శెట్టి.. రెమ్యూనరేషన్ ఎంత డిమాండ్ చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సినిమా చివర్లో 'జై హనుమాన్' చిత్రం త్వరలోనే రాబోతుందని, ఈ సినిమా మొత్తం హనుమాన్ కనిపిస్తాడని, ఆయన పాత్రనే కథానాయకుడి పాత్రగా ఉంటుందని, తేజ సజ్జ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.

Written By: Vicky, Updated On : October 18, 2024 11:36 am

Rishab Shetty

Follow us on

Rishab Shetty: ఈ ఏడాది సంక్రాంతి కానుకగా చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ లాంటి చిత్రాన్ని కూడా డామినేట్ చేసి, స్టార్ హీరోలకు కూడా సాధ్యం కానటువంటి అద్భుతమైన రికార్డ్స్ ని నెలకొల్పుతూ, ఫుల్ రన్ లో 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో, విజువల్ ఎఫెక్ట్స్ విషయం లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఏకంగా 450 కోట్ల రూపాయిల బడ్జెట్ తో సినిమాని తీసిన అనుభూతి కలిగించాడంటూ ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేసారు. ఇది కేవలం ఒక సినిమాతో సరిపెట్టే కథ కాదని, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గా రాబోతుందని, అనేక సూపర్ హీరోల సినిమాలు ఇందులో వస్తాయని ప్రశాంత్ వర్మ ఇది వరకే తెలిపాడు.

అలాగే సినిమా చివర్లో ‘జై హనుమాన్’ చిత్రం త్వరలోనే రాబోతుందని, ఈ సినిమా మొత్తం హనుమాన్ కనిపిస్తాడని, ఆయన పాత్రనే కథానాయకుడి పాత్రగా ఉంటుందని, తేజ సజ్జ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తాడని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. అయితే పార్ట్ 2 లో హనుమాన్ పాత్ర పోషించేది ఎవరు అనే దానిపై సోషల్ మీడియా లో ఇది వరకు ఎన్నో కథనాలు వచ్చాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంతారా చిత్రం లో హీరో గా నటించిన రిషబ్ శెట్టి, ‘జై హనుమాన్’ చిత్రంలో హనుమంతుడి క్యారక్టర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే గ్రాండ్ గా చేయనుంది మూవీ టీం. కాంతారా చిత్రం తో పాన్ ఇండియా లెవెల్ లో రిషబ్ శెట్టి కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో ఆయన హీరోగా నటించడమే కాకుండా, దర్శకుడిగా కూడా పని చేసాడు. అద్భుతంగా నటించినందుకు గానూ ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ లో హీరో గా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు.

శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గ్లిమ్స్ వీడియో కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘కాంతారా’ సిరీస్ తర్వాత వెంటనే ‘జై హనుమాన్’ లాంటి ప్రాజెక్ట్ లో హీరోగా చేస్తున్నాడంటే, భవిష్యత్తులో ఈయన ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదగబోతున్నాడా అనేది చూడాలి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధం అవుతున్నాడు. డిసెంబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది, ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే ‘జై హనుమాన్’ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ చిత్రానికి తెలుగు తో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా మంచి హైప్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.