రష్మిపై అత్యాచారయత్నం

బాలీవుడ్ హీరోయిన్ రష్మి దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. తనకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ‘నాపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు’ అని ఆరోపించింది. అయితే అతడి ప్రయత్నం నుంచి తప్పించుకోని పారిపోయినని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సీని ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది. ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను వివరించింది. స్టార్ కిడ్ అయిన తనను కూడా లైగింగ వేధింపు […]

Written By: Neelambaram, Updated On : March 4, 2020 2:16 pm
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ రష్మి దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. తనకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ‘నాపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేయబోయాడు’ అని ఆరోపించింది. అయితే అతడి ప్రయత్నం నుంచి తప్పించుకోని పారిపోయినని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సీని ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది.

ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను వివరించింది. స్టార్ కిడ్ అయిన తనను కూడా లైగింగ వేధింపు తప్పలేదని వాపోయింది. అవకాశాలు కావాలంటే కమిట్ కావాలని కొందరు యత్నించారని, వారి వాయిస్ రికార్డులు తన వద్ద భద్రంగా ఉన్నట్లు చెప్పింది. అయితే తాను వారి సినిమాల్లో నటించే అవకాశం లేదని చెప్పింది. అందుకే తనను సినిమాల నుంచి బ్యాన్ చేశారని చెప్పింది. వీటిని తాను ధైర్యంగా ఎదుర్కొన్నట్లు చెప్పింది.

రష్మీ దేశాయ్ బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల బిగ్ బాస్ షో ద్వారా రష్మీ దేశాయ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మి దేశాయ్ తనపై అత్యాచారయత్నం జరిగిందని ఆరోపించింది. యశ్రాజ్ పేరుతో సురజ్ అనే వ్యక్తి తనను మోసం చేసేందుకు యత్నించినట్లు చెప్పింది. యశ్రాజ్ వద్ద తాను పని చేస్తున్నానని చెప్పి ఒక రోజు ఆడిషన్ కు పిలిచాడని చెప్పింది. ఈ సందర్భంగా అతడు తనను రేప్ చేయబోయాడని చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు వైరలవుతోన్నాయి.