Akkineni Akhil: ‘ మెగా అభిమానుల్లో ఎప్పటి నుండో ఒక చిన్న నిరాశ , అసంతృప్తి దాగుంది. అదేమిటంటే రామ్ చరణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ లాగా నిల్చినటువంటి ‘రంగస్థలం’ చిత్రాన్ని కేవలం ప్రాంతీయ బాషా చిత్రం గా మిగిల్చడమే. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ‘పుష్ప’ రేంజ్ వసూళ్లు సునామీ ని సృష్టించేంత సత్తా ఉంది. అయినప్పటికీ మేకర్స్ ఎందుకో ఆ సాహసం చేయలేదు. అప్పటికే బాహుబలి సిరీస్ కారణంగా మన టాలీవుడ్ కి పాన్ ఇండియా మార్కెట్ కూడా వచ్చేసింది. అయినప్పటికీ మేకర్స్ ఆసక్తి చూపించలేదు. ఆరోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది , ఇది సాధారణమైన విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన లాంగ్ రన్ ని చూసి ట్రేడ్ పండితులు కూడా మెంటలెక్కిపోయారు.
ఒక్కమాటలో చెప్పాలంటే మన టాలీవుడ్ లో అత్యధిక సెంటర్స్ లో వంద రోజులు ఆడిన చివరి చిత్రం ఇదే అనొచ్చు. అయితే అభిమానుల్లో ఎలాంటి ఫీలింగ్ ఉందో , ఈ సినిమాపై ప్రముఖ యంగ్ హీరో అక్కినేని అఖిల్ లో కూడా అలాంటి ఫీలింగే ఉంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ‘రంగస్థలం చిత్రం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే వన్ ఆఫ్ ది కల్ట్ క్లాసిక్ అనొచ్చు. ఈ చిత్రం ఇప్పుడు విడుదల అయ్యుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసి ఉండేది. ‘పుష్ప’ తరహా లోనే ఇండియా లో బిగ్గెస్ట్ బ్రాండ్ అయ్యేది’ అంటూ చెప్పుకొచ్చారు అక్కినేని అఖిల్. ఆయన మాటలను ఏకీభవిస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కి అప్పట్లో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను రిలీజ్ చేసేంత ధైర్యం లేదు.
‘పుష్ప’ చిత్రాన్ని కూడా మొదట్లో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యాలని అనుకోలేదు. రాజమౌళి ఈ సినిమాకు ముంబై లో మంచి క్రేజ్ ఉందని, అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని , మీరు కచ్చితంగా నార్త్ ఇండియా లో విడుదల చేయాలనీ , లేదంటే చాలా నష్టపోతారని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడంతో , అల్లు అర్జున్ నిర్మాతలపై ఒత్తిడి చేసి ఈ చిత్రాన్ని నార్త్ ఇండియా లో విడుదల చేయించారు. ఇక ఆ తర్వాత హిస్టరీ ఏంటో తెలిసిందే. ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ నార్త్ ఇండియా లో ప్రభంజనం సృష్టించిన మాస్ ప్రాంతాల్లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ఒకవేళ రామ్ చరణ్ కూడా ఇదే విధంగా ఒత్తిడి చేసి రంగస్థలం చిత్రాన్ని నార్త్ ఇండియా లో విడుదల చేయించి ఉండుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

