రెండో పెళ్లేంటయ్యా స్వామీ ?: వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద కామెంట్స్ ను అలాగే కంటిన్యూ చేస్తూ తాజాగా రెండో పెళ్ళికి రెడీ అయిన హీరో సుమంత్ పై ట్వీట్ వార్ కి దిగాడు. ‘ఒక పెళ్లి నూరేళ్ళ పెంట, అలాంటిది రెండో పెళ్లేంటయ్యా స్వామీ ? నా మాట విని మానెయ్యి. పవిత్రగారు మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. తప్పు మీది, సుమంత్ ది కాదు. తప్పు ఈ దౌర్భాగ్య వ్యవస్థది’ అంటూ వివాదాల వర్మ మరో […]

Written By: admin, Updated On : July 29, 2021 10:13 am
Follow us on

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద కామెంట్స్ ను అలాగే కంటిన్యూ చేస్తూ తాజాగా రెండో పెళ్ళికి రెడీ అయిన హీరో సుమంత్ పై ట్వీట్ వార్ కి దిగాడు. ‘ఒక పెళ్లి నూరేళ్ళ పెంట, అలాంటిది రెండో పెళ్లేంటయ్యా స్వామీ ? నా మాట విని మానెయ్యి. పవిత్రగారు మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. తప్పు మీది, సుమంత్ ది కాదు. తప్పు ఈ దౌర్భాగ్య వ్యవస్థది’ అంటూ వివాదాల వర్మ మరో వివాదానికి తెర తీశాడు.

మొత్తానికి రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ సుమంత్ ని ఎందుకు టార్గెట్ చేసినట్టు ? నిజానికి సుమంత్ ను హీరోగా పరిచయం చేసింది ఆర్జీవీనే. అందుకే కావొచ్చు, సుమంత్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు చూసిన వర్మ తనదైన శైలిలో స్పందించారు.

‘ఒక సారి అయ్యాక కూడా నీకింకా బుద్ది రాకపోవడం ఏమిటి సుమంత్ ? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి,” అంటూ మరో కాంట్రవర్సీ కామెంట్ కూడా చేశాడు. ఏమిటో వర్మ.. వయసు పెరిగేకొద్దీ ఏమి మాట్లాడుతున్నాడో కూడా ఆలోచించడం లేదు అనుకుంటా. ఇక సుమంత్ విషయానికి వస్తే.. హీరోయిన్ కీర్తి రెడ్డితో గతంలో పెళ్లి జరిగింది.

అయితే, ఆమెకు సుమంత్ కి మధ్య వచ్చిన అభిప్రాయబేధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇక అప్పటి నుండి దాదాపు 15 ఏళ్ళు ఒంటరిగా ఉన్న సుమంత్ ఇప్పుడు పవిత్ర అనే ఆవిడని పెళ్ళాడబోవడానికి రెడీ అయ్యాడు. వీరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరుగనుందని తెలుస్తోంది.