Homeఎంటర్టైన్మెంట్ఆ వ్యక్తి మరణం మెగా ఫ్యామిలీని కలిచివేసింది !

ఆ వ్యక్తి మరణం మెగా ఫ్యామిలీని కలిచివేసింది !

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి తన కుటుంబం అంటే ఎనలేని ప్రేమాభిమానాలు. పైగా మనవళ్లు, మనవరాళ్లతో మెగాస్టార్ ఎప్పుడూ సందడిగా ఉంటారు. కానీ గతేడాది కరోనా వచ్చినప్పటి నుండి మెగాస్టార్ ఇంట్లో పనివాళ్ళతో సహా చాలమంది కరోనా బారిన పడ్డారు. ఇంట్లో కరోనా ప్రోటోకాల్ ని పాటిస్తూ వస్తున్నా ఇలా మెగా ఫ్యామిలీని కరోనా వెంటాడుతూనే ఉండటం.. మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. లాక్ డౌన్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే మొదట మెగాస్టార్ ఇంట్లో పని చేసే వారికి కరోనా సోకింది. ఇక గత కొన్ని నెలల క్రితం రామ్ చరణ్ కి కరోనా రావడం మెగా ఫ్యాన్స్ ను షాక్ కి గురిచేసింది.

అయితే చరణ్ కరోనా నుండి త్వరగానే కోలుకున్నారు. కానీ రెండో వేవ్ లో మాత్రం కుటుంబ సభ్యులతో పాటు పనిచేసే సిబ్బందికి కూడా కరోనా సోకడం.. తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ వానిటీ వ్యాన్ నడిపే డ్రైవర్ కరోనాతోనే మరణించడం ఇప్ప్పుడు మెగా ఫ్యామిలీని ఆందోళనలోకి నెట్టేసింది. వానిటీ వ్యాన్ డ్రైవర్ మెగా ఫ్యామిలీ దగ్గరే ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాడు. పైగా మెగా కుటుంబంతో సన్నిహితంగా మెలిగాడు. అన్నిటికి మించి రామ్ చరణ్ తో పాటు చిరంజీవికి ఆ డ్రైవరే ఎక్కువగా డ్రైవింగ్ కు వెళ్లేవారు.

అలాంటి వ్యక్తి కరోనా కారణంగా మరణించడం మెగా ఫ్యామిలీ మొత్తాన్ని తీవ్రంగా కలిచివేసింది. దీంతో రామ్ చరణ్ పూర్తిగా ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. మెగాస్టార్ కూడా ఐసోలేషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక మెగా కుటుంబంలో ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా సోకడం, ప్రస్తుతం పవన్ తన ఫామ్ హౌస్ లో తగిన చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న జరిగిన కరోనా పరీక్షలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కళ్యాణ్ దేవ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version