Homeఎంటర్టైన్మెంట్మరో సీక్వెల్‌ ఆలోచనలో రజనీ కాంత్‌!

మరో సీక్వెల్‌ ఆలోచనలో రజనీ కాంత్‌!


బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా భాషతో సంబంధం లేకుండా ఈ మధ్య సీక్వెల్ మూవీల సందడి నడుస్తోంది. మున్నాభాయ్‌ నుంచి దబాంగ్, హౌజ్‌ఫుల్‌ వరకూ హిందీలో చాలా సీక్వెల్స్‌ వచ్చాయి. పలువురు స్టార్ హీరోలు సీక్వెల్స్‌ చేస్తున్నాడు. కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకడైన కమల్‌ హాసన్‌ విశ్వరూపం మూవీని రెండు పార్టుల్లో చేశాడు. ఇప్పుడు ‘భారతీయుడు’ సీక్వెల్‌ అయిన ‘ఇండియన్’లో నటిస్తున్నాడు. తాజాగా మరో కోలీవుడ్‌ సూపర్ స్టార్ ర్రజనీకాంత్ కూడా తన హిట్‌మూవీ సీక్వెల్‌లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రజనీ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందించిన ‘పేట’ గతేడాది విడుదలై మంచి విజయం అందుకుంది. లింగా, కబాలి, కాలా, 2.0తో ఆకట్టుకోలేకపోయిన రజనీ.. పేటతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. ఆపై, ఏఆర్ మురుగదాస్‌తో దర్బార్ తో మరోహిట్ కొట్టిన సూపర్ స్టార్ ఇప్పుడు శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తె’ అనే మూవీల నటిస్తున్నాడు. నయనతార, మీన, కుష్బు, కీర్తి సురేశ్ ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. చివరి షెడ్యూల్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది.

దీని తర్వాత రజనీ ఏ మూవీ చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది. అది ‘పేట’కు సీక్వెల్‌ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కార్తీక్‌ సుబ్బరాజే చెప్పాడు. కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో అతను నిర్మించిన ‘పెంగ్విన్‌’ ఈ రోజే అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అతను ‘పేట’ గురించి మాట్లాడాడు. ‘పేట’ చేసేప్పుడు సీక్వెల్‌ ఆలోచనే లేదన్నాడు. కానీ, ఆ మూవీ విడుదలై మంచి విజయం సాధించిన తర్వాత సీక్వెల్‌ కథ తట్టిందని చెప్పాడు. ఇందుకోసం ఇప్పటికే కొన్ని ఐడియాలు ఉన్నాయని చెప్పాడు.ఇదే విషయాన్ని రజనీ దృష్టికి తీసుకెళ్లాడట. సూపర్ స్టార్ కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. రజనీ ఇప్పటికే రోబోకు సీక్వెల్‌గా 2.0 చేసిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version