Ishitha Koduri: ప్రస్తుతం నేటి సమాజంలో ఆడ, మగ అనే తేడా లేకుండా అన్నీ రంగాల్లో అమ్మాయిలు రాణిస్తున్నారు. ఒకప్పుడు కొన్ని ఆటలు మగవారు మాత్రమే ఆడాలి అన్న రూల్ ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారాయి ఆటకు అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా పోయింది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా స్పోర్ట్స్లో తమ సత్తాను చాటగలరు అని చెప్పుకునే ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అందులోకి ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ అమ్మాయి కూడా చేరింది.
దర్శక ధీరుడు రాజమౌళి కోడలు ఇషిత కోడూరి హైదరాబాద్ ఉమెన్ క్రికెట్ టీమ్లో ప్లేయర్. ఈ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. కానీ తాజాగా జరిగిన ఉమెన్ అండర్ 19 ఆటల్లో ఇషిత ఆటకు ఒక్కసారిగా అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. ప్రస్తుతం రాజ్కోట్లో ఉమెన్ అండర్ 19 క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఉత్తర్ ప్రదేశ్తో హైదరాబాద్ టీమ్ తలపడింది. అందులో బౌలర్గా ఇషిత మూడు వికెట్లు తీసి అందరినీ వావ్ అనిపించింది. ఈ మ్యాచ్ గెలవడానికి ఇషిత బౌలింగ్ మెయిన్ రోల్ ప్లే చేసిందని చెప్పాలి. దీంతో ఈ వార్తను రాజమౌళి ఇటీవల తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ‘స్పోర్ట్స్ ఫ్యాన్గా నేను నా పిల్లలను ఆ ఫీల్డ్లోకి పంపాలనుకున్నాను. కానీ వారు వారి ఇష్టప్రకారం వేర్వేరు ఫీల్డ్స్ను ఎంచుకున్నారు. కానీ నా మేనకోడలు ఇషితా కోడూరి.. హైదరాబాద్ స్టేట్ సీనియర్ ఉమెన్ క్రికెట్ టీమ్కు ఎంపికయ్యి ఈరోజు హిమాచల్ ప్రదేశ్కు పోటీగా ఆడనుంది. ఆల్ ది బెస్ట్ తల్లి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.