‘ప్రభాస్’ దృష్టి అంతా దాని పైనే !

నేషనల్ స్టార్ గా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా పైనే, తన దృష్టి అంతా పెట్టాడు. కాగా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే మధ్యలోనే ఇండియాకు తిరిగివచ్చేశారు టీం. అయితే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ కోసం మళ్లీ జార్జియా వెళ్లాలంటే కష్టం. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో జార్జియా […]

Written By: admin, Updated On : June 9, 2020 4:24 pm
Follow us on


నేషనల్ స్టార్ గా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా పైనే, తన దృష్టి అంతా పెట్టాడు. కాగా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే మధ్యలోనే ఇండియాకు తిరిగివచ్చేశారు టీం. అయితే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ కోసం మళ్లీ జార్జియా వెళ్లాలంటే కష్టం. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో జార్జియా నేపథ్యం కనబడేలా సెట్ వేస్తున్నారట, ఈ సెట్ విషయంలో ప్రభాస్ కూడా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇక జూలై సెకెండ్ వీక్ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను తీయనున్నారు.

కాగా ఈ ‘రాధే శ్యామ్’ గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారని, అత్యంత ధనికుడిగా ఆ రోజుల్లోని ఓల్డ్ గెటప్ లో ఒకలా.. అదేవిదంగా ప్రస్తుత కాలానికి సంబంధించి మరో గెటప్ లో ప్రభాస్ కనిపిస్తాడట. ఇక రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథే ఈ సినిమా అని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. పైగా 1960 కాలంలో ఈ సినిమా కథ సాగుతుందట,

‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఈ సినిమాలో టాల్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. 2021లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.