Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో సైతం తను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు… అయితే ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఆయన ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అప్పటినుంచి డిఫరెంట్ సినిమాలను చేస్తూ పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ప్రభాస్ ఎంటైర్ కెరియర్లో చేసిన ఒక మూడు సినిమాలు అతని ఇమేజ్ ను భారీగా డామేజ్ చేశాయి. నిజానికి ఆ దర్శకులు సైతం ప్రభాస్ ని అంత పెద్దగా వాడుకోలేదనే చెప్పాలి. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ‘ఆదిపురుష్’ సినిమాతో తనకు భారీ డిజాస్టర్ ని కట్టబెట్టి ప్రభాస్ ఇమేజ్ ని మొత్తానికే డామేజ్ చేసిన దర్శకుడు ఓం రావత్ కావడం విశేషం…
ఆయన ఆ మూవీ చేయకపోయిన బాగుండేది అనేంతలా ప్రభాస్ అభిమానులు సైతం ఇబ్బంది పడ్డారు అంటే ఆ సినిమా ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ కి ఒక భారీ సక్సెస్ ని కట్టబెట్టాలనే ఉద్దేశ్యంతో రాధాకృష్ణ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రభాస్ కి ఎలాంటి ఇమేజ్ ని తీసుకురాలేదు.
పైగా ఆ మూవీ చేసినందుకు అతని మీద భారీ విమర్శలైతే వచ్చాయి. కాబట్టి డైరెక్టర్ రాధాకృష్ణ కూడా ప్రభాస్ ని ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేశారనే చెప్పాలి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రాజా సాబ్’ సినిమా సైతం ప్రభాస్ ఇమేజ్ ను పూర్తిగా డామేజ్ చేసేసింది. ఇక ప్రభాస్ తో తెరకెక్కించాల్సిన సినిమా అయితే ఇది కాదని చాలామంది కామెంట్స్ చేశారు. ఇక ఈ మూవీని మీడియం రేంజ్ హీరోతో తెరకెక్కించి ఉంటే బాగుండేది. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ కథ కాదని చెప్పారు.
అలాగే ప్రభాస్ ని డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తానని చెప్పిన మారుతి ఈ సినిమాలో కొన్నిసార్లు భయపడే క్యారెక్టర్ లో కూడా చూపించాడు. దాన్ని ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు… ఇక ఈ ముగ్గురు దర్శకులు ప్రభాస్ ఇమేజ్ ని ఈ మధ్యకాలంలో చాలావరకు డ్యామేజ్ చేశారు…
