Pawan Fans Serious on Posani Comments: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై సినీ ప్రముఖులు ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ పై అకారణంగా నిందలు వేస్తే భూమిలో 100 అడుగుల లోతుకు పాతుకుపోతారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ రోజు తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన అనంతరం పోసాని మాట్లాడుతూ మేం సినిమాలోనే హీరోలమని, రియల్ హీరో సీఎం వైఎస్ జగన్ అని పోసాని చెప్పుకొచ్చాడు.
Bheemla Nayak
పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమాను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారని ఎవరి దగ్గరైనా సాక్ష్యం ఉంటే చెప్పండి, నా దగ్గర అయితే లేదని పోసాని వ్యాఖ్యానించారు. అయితే, పోసాని కామెంట్స్ పై పవన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మెంటల్ నా కొడుక్కి మైండ్ దొబ్బింది అని ఒకరు, వీడిని వీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టాలి’ అని మరొకరు చాలా వైల్డ్ గా కామెంట్స్ చేశారు.
Also Read: ‘భీమ్లా నాయక్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్
అలాగే మరికొందరు నెటిజన్లు పోసాని పై సీరియస్ అవుతూ.. పోసానికి సహజంగా పిచ్చి ఉంది, అతను ఇలాంటి కామెంట్స్ చేసి.. ఆ పిచ్చిని అందరికి పరిచయం చేస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పటికైనా పోసాని ఆలోచించి కామెంట్స్ చేస్తే బెటర్.
Posani Krishna Murali
అన్నట్టు పోసాని ఇంకా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు. సినీ పరిశ్రమకు ఇక అన్నీ మంచిరోజులే. త్వరలోనే టికెట్ ధరలపై సానుకూల నిర్ణయం వస్తుంది’ అని పోసాని చెప్పుకొచ్చాడు. ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జగన్ తో మెగాస్టార్ తో పాటు మహేష్, ప్రభాస్ కూడా భేటీ అయిన సంగతి తెలిసిందే.
Also Read: భీమ్లానాయక్ ప్రభావం గట్టిగానే కనిపించింది !