Parineeti Chopra: బాలీవుడ్ క్యూట్ బ్యూటీ “పరిణీతి చోప్రా” విభిన్నమైన పాత్రల్లో నటించి తన నటనతో ఎంతోమంది ప్రేక్షక అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తనదైన శైలిలో సినిమాలు, షోలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది ఈ భామ. అయితే ఈ అమ్మడు ఓ టాలెంట్ షోపై మండిపడింది.”హునర్బాజ్” అనే టాలెట్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనుంది పరిణీతి.
అయితే ఇటీవల దీనికి సంబంధించిన ఒక పోస్ట్ను ‘ఫన్ కిడ్స్ ఇండియా’ ట్విటర్లో షేర్ చేసింది.ఆ ట్వీట్ లో ‘యూకేకి చెందిన నలుగురు పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించగా రేపు మీ ఆడిషన్ను నమోదు చేసుకోండి. ఇదే చివరి అవకాశం.. వదులుకోకండి. అంటూ పరిణీతి చోప్రాను న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా చేర్చి ట్వీట్ చేసింది ఫన్ కిడ్స్ ఇండియా. అయితే ఈ పోస్టుపై స్పందించిన పరిణీతి …నేను ఇక ఈ షోతో భాగస్వామ్యం కాను. దయచేసి నా పేరును తొలగించండి. పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో నా పేరును ఇలా వాడుకోవద్దు.అంటూ ఫన్ కిడ్స్ ఇండియా షేర్ చేసిన ట్వీట్ను స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే అంతకుముందే ఫన్ కిడ్స్ ఇండియా ఆ ట్వీట్ను తొలగించింది. తర్వాత షో నిర్వాహకులు కూడా తమ అభిప్రాయాలను పరిణీతితో పంచుకునే ప్రయత్నం చేశారట.ఫన్ కిడ్స్ ఇండియా నిర్వాహకులు పరిణీతి మెనేజర్తో వారు మూడు నెలలుగా టచ్లో ఉంటున్నామని తెలిపారు. అలానే పరిణీతి ఈ షోలో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంటుంది అని త్వరలోనే ఆమెను కలుసుకునేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.