Naveen Polishetty: ‘జాతిరత్నం’ హీరోపై త్రివిక్రమ్ పెట్టుబడి

Naveen Polishetty: ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ తో మన ‘జాతిరత్నం’ దరిద్రం టాలీవుడ్ లో పోయింది. అంతకుముందు పలు హిందీ సినిమాల్లో చిన్న చిన్న వేశాలు వేసి.. తెలుగులోనూ ఆయా సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసాడు హీరో నవీన్ పొలిశెట్టి. 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు పక్కన చిన్న పాత్రలో చేశాడు. ఆ తర్వాత ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వచ్చిన ‘జాతిరత్నాలు’ […]

Written By: NARESH, Updated On : September 15, 2021 4:25 pm
Follow us on

Naveen Polishetty: ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ తో మన ‘జాతిరత్నం’ దరిద్రం టాలీవుడ్ లో పోయింది. అంతకుముందు పలు హిందీ సినిమాల్లో చిన్న చిన్న వేశాలు వేసి.. తెలుగులోనూ ఆయా సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసాడు హీరో నవీన్ పొలిశెట్టి. 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు పక్కన చిన్న పాత్రలో చేశాడు. ఆ తర్వాత ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అనంతరం వచ్చిన ‘జాతిరత్నాలు’ మూవీతో నవీన్ పొలిశెట్టి బ్రేక్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో వెనుదిరిగి చూసుకోకుండా అయ్యింది. ఈ ఊపులోనే చాలా ఆఫర్లు నవీన్ తలుపుతట్టాయి. యూవీ క్రియేషన్స్, మైత్రీ మూవీస్ సహా చాలా మంది అడ్వాన్సులు ఇచ్చినా మన హీరో కొన్ని తీసుకొని కొన్ని తిరిగిచ్చేశాడని టాక్ వినిపించింది.

కథ బలంగా ఉంటేనే సినిమా చేస్తానని ఇప్పటివరకు ఆ పనిలో ఉన్నాడు. చివరకు త్రివిక్రమ్ లాంటి సీనియర్ దర్శకుడు పెట్టుబడి పెట్టి సినిమా తీసే స్థాయికి ఎదిగాడు. తాజాగా నవీన్ పొలిశెట్టి తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఒక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించాడు. కళ్యాణ్ శంకర్ అనే నూతన దర్శకుడుతో నవీన్ సినిమా పట్టాలెక్కింది. ఇదో వినోదాత్మకంగా సాగే ఒక యూనిక్ కాన్సెప్ట్ అని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో నవీన్ పూర్తి డిఫెరెంట్ గా కనిపించనున్నాడట..

ప్రస్తుతం ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థతోపాటు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్రివిక్రమ్ భార్య నిర్మాతగా మారి ఈ తొలి చిత్రాన్ని తీస్తోంది. త్రివిక్రమ్ ఎంట్రీతో ఈ సినిమా ఖచ్చితంగా మంచి సరుకు అని.. అందుకే పెట్టుబడి పెడుతున్నట్టుగా తెలుస్తోంది.