ఐపీఎల్ కు కరోనా వైరస్ గండం!

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నప్పటికీ ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ సౌరవ్ గంగూలీ స్పష్టం చేసినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆటలకు వచ్చి చూసే ప్రజల సంఖ్య తగ్గిపోతే, ఆదాయం గణనీయంగా పడిపోతుందని కలవరం చెందుతున్నారు. మరోవంక, రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ హోమ్‌గ్రౌండ్‌ అయిన బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టు సమాచారం. లీగ్‌ను వాయిదా వేయాలని […]

Written By: Neelambaram, Updated On : March 11, 2020 4:29 pm
Follow us on

దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తున్నప్పటికీ ఐపీఎల్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ సౌరవ్ గంగూలీ స్పష్టం చేసినా.. ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఆటలకు వచ్చి చూసే ప్రజల సంఖ్య తగ్గిపోతే, ఆదాయం గణనీయంగా పడిపోతుందని కలవరం చెందుతున్నారు.

మరోవంక, రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ హోమ్‌గ్రౌండ్‌ అయిన బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంటున్నట్టు సమాచారం. లీగ్‌ను వాయిదా వేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్

ఉద్యోగికి కరోనా సోకిందని ఇటీవలే గుర్తించారు. అమెరికా నుంచి వచ్చిన ఆ వ్యక్తి దాదాపు 2,666 మందిని తాకినట్టు తెలిసింది. ప్రస్తుతం అతను ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో, బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌‌ సంస్థలు ఉన్న ప్రదేశాల్లోని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఈ నేపథ్యంలో బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లకు తాము ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి రాష్ట్ర సర్కారు స్పష్టం చేసిందని బెంగళూరులోని దిగ్విజన్ 24/7 అనే టీవీ చానల్ కథనం ప్రసారం చేసింది. దాంతో, బెంగళూరులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.