Namrata Shirodkar: శ్రీదేవి, మాధురి దీక్షిత్ లను దారుణంగా అవమానించిన మహేష్ భార్య నమ్రత… కెరీర్ బిగినింగ్ లోనే అతిపెద్ద కాంట్రవర్సీ

ముంబైలో పుట్టి పెరిగిన నమ్రత శిరోద్కర్ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆమె తల్లి మీనాక్షి శిరోద్కర్ సైతం నటి. 1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత శిరోద్కర్... అనంతరం మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది.

Written By: S Reddy, Updated On : September 27, 2024 11:25 am

Namrata Shirodkar

Follow us on

Namrata Shirodkar: మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ చాలా పద్ధతిగా ఉంటారు. వివాహం అనంతరం ఈమె పక్కా గృహిణిగా మారిపోయింది. వివాదాలకు దూరంగా ఉండే నమ్రత గతంలో లెజెండ్రీ యాక్ట్రెస్ శ్రీదేవిని దారుణంగా అవమానించింది. శ్రీదేవి, మాధురి దీక్షిత్, జూహీ చావ్లా లను ఉద్దేశించి అనుచిత కామెంట్స్ చేసింది. నమ్రత అలాంటి కామెంట్స్ చేయడం వెనుక కారణం ఏమిటో చూద్దాం…

ముంబైలో పుట్టి పెరిగిన నమ్రత శిరోద్కర్ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆమె తల్లి మీనాక్షి శిరోద్కర్ సైతం నటి. 1993లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత శిరోద్కర్… అనంతరం మిస్ యూనివర్స్ పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ఆమెకు 6వ స్థానం దక్కింది. 1998లో నమ్రత సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. మేరే దో అన్మోల్ రతన్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

పుకార్, వాస్తవ్ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. నటిగా మారక ముందు నమ్రత చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. బాలీవుడ్ ని శాసించిన శ్రీదేవి, జూహీ చావ్లా లను ఉద్దేశిస్తూ నమ్రత అనుచిత కామెంట్స్ చేసింది. 1996లో రెడిఫ్ లో ఆమె ఓ అభిమానితో చాట్ చేసింది. ఈ చాట్ లో శ్రీదేవి, మాధురి దీక్షిత్ లను ఆమె అవమానించారు.

శ్రీదేవిపై మీ అభిప్రాయం ఏమిటని అడగ్గా… శ్రీదేవిని నేను ఎప్పుడూ కలవలేదు. కానీ వ్యక్తిత్వం మంచిది కాదని నాకు తెలిసింది అన్నారు. శ్రీదేవి ‘ఫ్రిజిడ్ యాజ్ ఐస్’, అని నమ్రత అన్నారు. శ్రీదేవి, జూహీ చావ్లాలను ఉద్దేశిస్తూ నమ్రత ‘లో సొసైటీ’ అని అన్నారు. సమాజంలో తక్కువ గౌరవం ఉన్నవారు. కల్చర్ తెలియనివారని అర్థం వచ్చేలా నమ్రత వారిని అభివర్ణించారు.

మరో స్టార్ లేడీ మాధురి దీక్షిత్ ని కూడా కించపరుస్తూ నమ్రత కామెంట్స్ చేసింది. నమ్రత బహుశా తన చాట్ బయటకు రాదని భావించి ఉండవచ్చు. అప్పట్లో శ్రీదేవి, జుహీ చావ్లా, మాధురి దీక్షిత్ లపై నమ్రత చేసిన అనుచిత కామెంట్స్ సంచలనం రేపాయి. అప్పుడే పరిశ్రమలో అడుగుపెడుతున్న నమ్రత మీడియా అటెన్షన్ కోసం ఇలా చేసి ఉండొచ్చు.

తెలుగులో నమ్రత వంశీ, అంజి చిత్రాలు చేసింది. వంశీ కంటే ముందుగా మొదలైన అంజి డిలే కావడంతో ఆలస్యంగా విడుదలైంది. ఇక వంశీ మూవీ సెట్స్ లో మహేష్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత 2005లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత నమ్రత నటనకు గుడ్ బై చెప్పింది. ప్రస్తుతం ఆమె మహేష్ బాబుకు సలహాదారుగా, బిజినెస్ ఉమన్ గా రాణిస్తుంది. మహేష్ దంపతులకు సితార, గౌతమ్ సంతానం.