Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయిలో మన దర్శకులు సైతం సినిమాలను చేస్తున్నారు. మన హీరోలు సైతం దర్శకుల అడుగుజాడల్లో నడుస్తున్నారు. వాళ్ళు చేసే మంచి కథలకు హీరోలు తమ సహాయ సహకారాలను అందించి దర్శకులు ఎలా అయితే కోరుకుంటున్నారో అలాంటి పాత్రలో వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. నాగార్జున లాంటి నటుడు సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిమితమైనప్పటికి తను రాబోయే సినిమాలతో పాన్ ఇండియా బాట పట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి సక్సెస్ ల పరంగా కొంతవరకు వెనుకబడిపోయిన నాగార్జున ప్రస్తుతం తన వందో సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సైతం మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు… నాగార్జున కి చెప్పిన కథ చెప్పినట్టుగా తీయకపోతే ఆయన దర్శకుల మీద కొంత వరకు సీరియస్ అవుతారట.
ఎందుకంటే నాగార్జున ఒప్పుకోవడం వల్లే ఆ సినిమాలు మెటీరియలైజ్ అవుతాయని దానివల్లే ప్రొడ్యూసర్ భారీ మొత్తంలో డబ్బులు పెట్టడానికి ముందుకు వస్తాడని అందులో ఏ తప్పు జరిగిన తనే బాధ్యత వహించాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో నాగార్జున ఉంటాడట… అందువల్లే ఆయన రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారినప్పుడు ఆ ఇద్దరు దర్శకులను తిట్టాడట…
వాళ్లెవరూ అంటే అందులో ఒకరు భాయ్ సినిమా దర్శకుడు ‘వీరభద్ర చౌదరి’ కాగా, మరొకరు డమరుకం సినిమా దర్శకుడు ‘శ్రీనివాసరెడ్డి’ కావడం విశేషం…శ్రీనివాస్ రెడ్డి మీద కొంచెం కోపగించుకున్నాడట..కానీ వీరభద్రం చౌదరి మాత్రం చాలావరకు డిసప్పాయింట్ చేశావ్ అంటూ అందరి ముందే అతన్ని తిట్టాడట. ఇక ఏది ఏమైనా కూడా సినిమా సక్సెస్ అవ్వాలంటే అదంతా దర్శకుడి చేతిలోనే ఉంటుంది.
కానీ ఒక సినిమా పట్టలెక్కాలంటే మాత్రం అది హీరోల చేతుల్లో ఉంటుంది. కాబట్టి నాగార్జున ప్రతి విషయాన్ని తను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ ఏదైనా కూడా తన వల్లే అని అతను భావిస్తుంటాడు…
