Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది ‘జబర్దస్త్’ మాత్రమే. ఈ బిగ్గెస్ట్ కామెడీ షో నుండి ఇప్పటి వరకు మన టాలీవుడ్ లోకి ఎంత మంది కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నేడు ఇండస్ట్రీ లో వీళ్లంతా గొప్ప స్థాయిలో ఉన్నారు. అయితే వీళ్లంతా జబర్దస్త్ ని ఎప్పుడైతే వదిలేసారో , అప్పటి నుండే ఈ షో క్రేజ్ బాగా పడిపోయింది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. అందుకే గతం లో గురు , శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ కామెడీ షో, ఆ తర్వాత శుక్ర , శనివారాలు షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు టీఆర్ఫీ రేటింగ్స్ ఇంకా పడిపోవడం తో ఆదివారం కి షిఫ్ట్ చేశారు.
ఈ నెల 26 నుండి ఈ కామెడీ షో ప్రతీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ సరికొత్త వెర్షన్ లో హైపర్ ఆది గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. హైపర్ ఆది కంటే ముందుగా నాగబాబు జడ్జీగా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వడం జబర్దస్త్ ఆడియన్స్ లో మంచి జోష్ ని తీసుకొచ్చింది. గతం లో ఈ షో నుండి వెళ్లిపోయిన మొట్టమొదటి వ్యక్తి నాగ బాబే. ఆ తర్వాత రోజా కూడా కొన్నాళ్ళకు ఈ షో నుండి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత చమ్మక్ చంద్ర , హైపర్ ఆది , సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను , ఇలా జబర్దస్త్ కి వెన్నుముక లాగా ఉన్న ప్రతీ ఒక్కరు సినిమాల్లో బాగా అవకాశాలు రావడం తో ఈ షో నుండి నుండి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఒక్కొకరుగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. నాగబాబు తో మొదలైన రీ ఎంట్రీ , హైపర్ ఆది వరకు చేరింది.
రాబోయే రోజుల్లో చమ్మక్ చంద్ర , గెటప్ శ్రీను వంటి వారు కూడా రీ ఎంట్రీ ఇవ్వొచ్చు. ఇదంతా పక్కన పెడితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు కి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నట్టు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కి నాగబాబు 5 నుండి 10 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఆయనతో పాటు సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూడా ఈ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు కూడా రెమ్యూనరేషన్ గట్టిగానే ఇస్తున్నారట. ఇలా జబర్దస్త్ లో జరిగిన ఈ మార్పులు , చేర్పులు , ఆ షో ని ఎక్కడికి తీసుకెళ్లి ఆపుతుందో చూడాలి. గురువారం నుండి ఆదివారం కి షిఫ్ట్ అయ్యింది. ఇక ఇప్పటికీ కూడా టీఆర్ఫీ రేటింగ్స్ రాకపోతే, ఈ షో మనుగడకి ప్రమాదం అని చెప్పొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.






