నో అమెరికా అంటున్న అవసరాల

కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగ్ ల మీద బాగా పడింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర లేదు. తాజాగా యంగ్ హీరో నాగశౌర్య కొత్త చిత్రం ఒకటి సగం షూటింగ్ పూర్తి చేసుకొని సడెన్ గా ఆగిపోయింది. పీపుల్ మీడియా బ్యానర్లో నాగశౌర్య కథానాయకుడిగా అవసరాల శ్రీనివాస్ కొంతకాలం క్రితం ఒక సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్ర కథ డిమాండ్ మేరకు కొంత భాగం ఇండియాలోను కొంత భాగం అమెరికాలోను షూటింగ్ చేయాల్సి ఉంటుందట ..ఆ […]

Written By: admin, Updated On : April 13, 2020 3:03 pm
Follow us on


కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగ్ ల మీద బాగా పడింది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర లేదు. తాజాగా యంగ్ హీరో నాగశౌర్య కొత్త చిత్రం ఒకటి సగం షూటింగ్ పూర్తి చేసుకొని సడెన్ గా ఆగిపోయింది. పీపుల్ మీడియా బ్యానర్లో నాగశౌర్య కథానాయకుడిగా అవసరాల శ్రీనివాస్ కొంతకాలం క్రితం ఒక సినిమాను మొదలుపెట్టాడు. ఈ చిత్ర కథ డిమాండ్ మేరకు కొంత భాగం ఇండియాలోను కొంత భాగం అమెరికాలోను షూటింగ్ చేయాల్సి ఉంటుందట ..ఆ క్రమంలో ఇండియాకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. మిగతా సన్నివేశాల్ని అమెరికాలో చిత్రీకరిద్దామని అనుకుంటూ ఉండగానే కరోనా అడ్డువచ్చింది. దాంతో అమెరికా షూటింగు సందిగ్ధం లో పడింది .

ఇక చేసేది లేక నిర్మాతలు కథలో అమెరికా ప్రస్తావన లేకుండా చేసి, మిగతా భాగాన్ని కూడా ఇండియా లోనే పూర్తి చేసేలా చూడమని అవసరాల శ్రీనివాస్ తో చెప్పారట. సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయమనీ, లేదంటే తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందని అన్నట్టుగా తెలుస్తోంది … అవసరాల శ్రీనివాస్ దర్శకుడే గాక మంచి రచయిత కూడా అవడం తో ఆయనకు కథపై మంచి పట్టుంది. అందువలన ఆయన కథను మార్చుకుని, అమెరికా వెళ్లకుండా ఇక్కడే షూటింగ్ ఫినిష్ చేసేలా ఏర్పాట్లు చేసు కొంటున్నాడు . .