Devi Sri Prasad: ఐటెం సాంగ్​ను భక్తిపాటలతో పోల్చిన డీఎస్పీ.. తెలంగాణ ఎమ్మెల్యే స్ట్రాంగ్​ వార్నింగ్​

Devi Sri Prasad: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాస్​ ఎంటర్​టైనర్​ మూవీ పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో బాక్సాఫీసులు బద్దలుకొట్టేస్తోంది. కాగా, ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్​కు చేరుకుని రికార్డు సృష్టించింది. కాగా, మరోవైపు ఈ పాట మగవాళ్లను తక్కువ చేస్తన్నట్లు ఉందంటూ.. పలువురు విమర్శిస్తూ కేసులు కూడా పెట్టారు. ఇదంతా పక్కన […]

Written By: Raghava Rao Gara, Updated On : December 18, 2021 3:39 pm
Follow us on

Devi Sri Prasad: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మాస్​ ఎంటర్​టైనర్​ మూవీ పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో బాక్సాఫీసులు బద్దలుకొట్టేస్తోంది. కాగా, ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్​కు చేరుకుని రికార్డు సృష్టించింది. కాగా, మరోవైపు ఈ పాట మగవాళ్లను తక్కువ చేస్తన్నట్లు ఉందంటూ.. పలువురు విమర్శిస్తూ కేసులు కూడా పెట్టారు. ఇదంతా పక్కన పెడితే..

Devi Sri Prasad

పుష్ప సినిమా ప్రమోషన్స్​లోభాగంగా మ్యూజిక్​ డైరకెట్ర్ దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) చేసిన కామెంట్స్ ఇప్పుడు మరో వివాదానికి దారి తీశాయి. ఐటెం సాంగ్​ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవిశ్రీ ప్రసాద్​ చేసిన వ్యాఖ్యలపై హందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​ దేవి శ్రీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే దేవి తన తప్పును ఒప్పుకుని హిందువులకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే బయట ఒక్క అడుగు కూడా పెట్టలేడని వార్నింగ్ ఇచ్చారు.

Also Read: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఊ అంటావా సాంగ్ మేల్ వెర్షన్…

oo antava song male version goes viral on social media

ఐటెం సాంగ్​ను భక్తి గీతాలతో పోల్చడం ఏంటని.. దీనిపై హిందువులు చాలా కోపంగా ఉన్నారని రాజాసింగ్ అన్నారు. ఈ విషయంపై దేవి క్షమాపణలు చెప్పకపోతే.. తెలంగాణ ప్రజలు చెప్పులతో తరిమి కొడతారని హెచ్చరించారు. పుష్ప ఐటెం సాంగ్​లోని లిరిక్స్​ను దేవుడి శ్లోకాలతో పోల్చడం సిగ్గుచేటని ఆరోపించారు. ఇటీవలే పుష్ప సినిమా ప్రమోషన్స్​లో దేవి శ్రీ.. రింగ రింగా, ఊ అంటావా మావా, ఈ రెండు పాటలను భర్తి పాటలుగా మార్చి పాడారు. అంతటితో ఆగకుండా.. ఐటెం సాంగ్స్​, దేవుడి పాటలు తన దృష్టిలో ఒకటేనని అన్నారు. దీంతో దేవిశ్రీపై సోషల్​మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: సమంత అందుకే అంత ప్రత్యేకం… సక్సెస్ సీక్రెట్ అదే!