రజనీ ఫ్యాన్స్ కి సందేశం.. సమస్యేం లేదు టెన్షన్ వద్దు!

ఈ ఉదయం ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ ఆరోగ్యం పై మళ్ళీ వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో రజిని అభిమానులు మళ్ళీ ఆందోళన పడుతున్నారు. అసలు ఏమి జరిగి ఉంటుంది ? సూపర్ స్టార్ కి వచ్చిన అనారోగ్య సమస్య ఏమిటి ? అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. అయినా, రజనీకాంత్‌ తన హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లేందుకు […]

Written By: admin, Updated On : June 15, 2021 10:47 am
Follow us on

ఈ ఉదయం ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ ఆరోగ్యం పై మళ్ళీ వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో రజిని అభిమానులు మళ్ళీ ఆందోళన పడుతున్నారు. అసలు ఏమి జరిగి ఉంటుంది ? సూపర్ స్టార్ కి వచ్చిన అనారోగ్య సమస్య ఏమిటి ? అంటూ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా పలు దేశాలు ఇతర దేశాల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

అయినా, రజనీకాంత్‌ తన హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి వచ్చేలా చర్యలు తీసుకోవడంతో ఫ్యాన్స్ కి మరింత టెన్షన్ పట్టుకుంది. ఎంత టెన్షన్ లేకపోతే, ఈ పరిస్థితుల్లో అమెరికా వెళ్లాలని రజిని నిర్ణయించుకుంటారు ? పైగా ప్రత్యేక అనుమతి తీసుకున్నారంటే.. ఏదో సమస్యే ఉండి ఉంటుంది అని రజనీ అభిమానులు ప్రస్తుతం కలవరపడుతున్నారు.

అయితే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎలాంటి టెన్షన్ పడొద్దు అని, రజినీకాంత్ కేవలం వైద్య పరీక్షల కోసమే అమెరికా వెళ్లారని, అంతకు మించి భయపడే సమస్య ఏమి లేదని, ఫ్యాన్స్ అందరూ దైర్యంగా ఉండాలని రజిని సన్నిహితుల నుండి ఫ్యాన్స్ కి అందిన సమాచారం. ఇక ప్రత్యేక విమానంలో రజినీకాంత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు.

ఈ విమానంలో పదిహేను మంది వరకూ ప్రయాణించే అవకాశం ఉండటంతో.. రజిని చిన్న కుమార్తె, ఆమె భర్త కూడా రజినీతో పాటు అమెరికా వెళ్లారు. మరోపక్క హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’ సినిమా షూట్ కోసం రజనీ పెద్ద అల్లుడు హీరో ధనుష్‌, పెద్ద కుమార్తె ఐశ్వర్య, ఆమె పిల్లలు కూడా అమెరికాలోనే ఉన్నారు. వారే అక్కడ రజిని హెల్త్ చెకప్ కి సంబధించిన ఏర్పాట్లు అన్ని చూసుకున్నారు.