Vaishnav Tej, Krish Movie Updates : మెగా మేనల్లుడి ‘కొండపొలం’ రిలీజ్ కి సిద్ధం !

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసి.. తనకంటూ కొంత స్టార్ డమ్ తో పాటు మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే, ఇప్పుడు అతని రెండో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే ఒక నవల ఆధారంగా సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయింది. కేవలం […]

Written By: admin, Updated On : August 18, 2021 12:47 pm
Follow us on

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసి.. తనకంటూ కొంత స్టార్ డమ్ తో పాటు మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే, ఇప్పుడు అతని రెండో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ (Krish) దర్శకత్వంలో ‘కొండపొలం’ అనే ఒక నవల ఆధారంగా సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయింది. కేవలం క్రిష్ ఈ సినిమాను 40 రోజుల్లోనే ఫినిష్ చేసి ఫస్ట్ కాపీ ఇచ్చాడు. కానీ కరోనాతో పాటు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. అయితే, తాజాగా క్రిష్ ఈ సినిమాను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ చేశాడు.

ఈ నెల 20వ తేదీన ఈ సినిమా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా రివీల్ చేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తామని క్రిష్ నుండి ఒక అధికారిక ప్రకటన వచ్చింది. 20వ తేదీన ఉదయం 10:15 నిమిషాలకు క్రిష్ – వైష్ణవ్ తేజ్ మూవీ పోస్టర్ రాబోతుంది. అన్నట్టు ఈ సినిమా పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగనుంది.

పైగా కథ చాలా సహజంగా ఉంటుంది. అలాగే కథలో చాలా తక్కువ పాత్రలు ఉంటాయట. ఇక పక్కా ఎమోషన్ తో నడిచే సినిమా కావడంతో ఈ సినిమా పై ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాని మెగా ఫ్యామిలీకి ప్రత్యేకంగా ప్రివ్యూ వేసారు. సినిమా అవుట్ ఫుట్ పట్ల ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని ఆ మధ్య మేము రివీల్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఉప్పెనతో వచ్చిన క్రేజ్ ను, వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో ఏ స్థాయిలో స్టార్ డమ్ గా మార్చుకుంటాడో చూడాలి.