Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్ వచ్చిన ప్రతి ఒక్కరు చిరంజీవి తో సినిమా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉంటారు. ఇక ఈ క్రమంలోనే కొంతమందికి ఆయనతో సినిమా చేసే అవకాశం దొరికితే మరికొంతమందికి మాత్రం ఆ అవకాశం రావడం లేదు. ఇంకొంతమంది మాత్రం స్టార్ డైరెక్టర్లు కావాలని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న కూడా చిరంజీవి మాత్రం వాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ లిస్టులో పూరి జగన్నాధ్, హరీష్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు ఉన్నారు. వీళ్ళందరు చిరంజీవితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో వీళ్ళందరికీ చిరంజీవితో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయాయి. దాంతో మరోసారి వీళ్ళు చిరంజీవితో సినిమా చేయాలనే ఆలోచన ను మానుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి సక్సెస్ లో ఉన్న వారితో మాత్రమే సినిమాలు చేస్తాడు. అలాగే తన ఇమేజ్కు తగ్గట్టుగా సినిమాలను చేయగలిగే వారు, తను చెప్పినట్టు వినే వారని మాత్రమే డైరెక్టర్లుగా పెట్టుకుంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా ఈ ముగ్గురు దర్శకులతో చిరంజీవి సినిమా చేస్తే కమర్షియల్ గా అతని స్థాయి అనేది మరింత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. కానీ ఎందుకో అతను నమ్మడం లేద. ఇంతకు ముందుు త్రివిక్రమ్ తో సినిమా ఆల్మోస్ట్ అనౌన్స్ మెంట్ దాకా వచ్చి ఆగిపోయింది.
ఎందుకని అలా చేశారు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేద. కొరటాల శివు దర్శకత్వంలో చిరంజీవి చేసిన ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అప్పటినుంచి చిరంజీవి ఆచి తూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. కథ బాగున్నంత మాత్రాన దర్శకులకు సినిమాను ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని,
కథ విషయంలో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే అందులో వాళ్లకి ఎలాంటి సందేహాలు లేవని తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్లతో సినిమాలు చేయడం మంచిదని ఆయన డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాబి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య అనే సినిమా వచ్చేసింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడంతో మరోసారి అదే కాంబోను రిపీట్ చేస్తుండటం విశేషం…

