అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీ చేయాలని వీరిద్దరూ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ.. పదేళ్లు గడిచినా ఇప్పటి వరకూ కుదరలేదు. అయితే.. అనూహ్యమైన పరిస్థితుల్లో వీరి కాంబో సెట్ కావడం విచిత్రం. అయితే.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి ముందు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సర్కారు వారి పాట’ పూర్తికావాల్సి ఉంది.
దానికి ఇంకా చాలా సమయం ఉంది. సో.. మహేష్-త్రివిక్రమ్ మూవీని అనౌన్స్ చేయడానికి కూడా కావాల్సినంత సమయం ఉంది. దీంతో.. ఓ స్పెషల్ డే రోజున సినిమాను ప్రకటించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అదే మే 31. ఆ రోజు మహేష్ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే. ఈ స్పెషల్ డే సందర్భంగా.. తమ హ్యాట్రిక్ మూవీ అనౌన్స్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. మరి, ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో చూడాలి.