తిరిగి ఇచ్చేయాలి… లేదంటే బ్యాడ్ అయిపోతాం

‘ఊరు మనకు చాలా ఇచ్చింది ఎంతో కొంత తిరిగిచ్చేయాలి, లేదంటే లావైపోతాం’ శ్రీమంతుడు సినిమా కోసం కొరటాల రాసిన ఈ డైలాగ్ చాలా ఫేమస్. మన అభివృద్ధికి కారణమైన ఎవరికైనా తిరిగి మేలు చేయాలన్నదే ఆ డైలాగ్ కాన్సెప్ట్. ప్రస్తుతం మహేష్ ఇదే ఫాలో అవుతున్నట్లు ఉన్నాడు. తనను తిరుగులేని స్టార్ ని చేసిన టాలీవుడ్ అభివృద్ధి కోసం మహేష్, అందరూ మెచ్చుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహేష్ కొన్నాళ్ల క్రితం జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]

Written By: admin, Updated On : December 20, 2020 12:33 pm
Follow us on


‘ఊరు మనకు చాలా ఇచ్చింది ఎంతో కొంత తిరిగిచ్చేయాలి, లేదంటే లావైపోతాం’ శ్రీమంతుడు సినిమా కోసం కొరటాల రాసిన ఈ డైలాగ్ చాలా ఫేమస్. మన అభివృద్ధికి కారణమైన ఎవరికైనా తిరిగి మేలు చేయాలన్నదే ఆ డైలాగ్ కాన్సెప్ట్. ప్రస్తుతం మహేష్ ఇదే ఫాలో అవుతున్నట్లు ఉన్నాడు. తనను తిరుగులేని స్టార్ ని చేసిన టాలీవుడ్ అభివృద్ధి కోసం మహేష్, అందరూ మెచ్చుకునే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహేష్ కొన్నాళ్ల క్రితం జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించి, తాను నటించే చిత్రాలలో నిర్మాణ భాగస్వామిగా ఉంటూ, నిర్మాతలకు రిస్క్ తగ్గిస్తున్నారు.

Also Read: సంక్రాంతికి బరిలో దిగిన పందెం కోళ్లు

అలాగే తన సొంత నిర్మాణ సంస్థలో యువ హీరోలతో సినిమాలు చేసే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే హీరో అడివి శేషు ప్రధాన పాత్రలో మేజర్ మూవీ నిర్మిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన మేజర్ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకోగా, పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. కాగా మరో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టితో కొత్త చిత్ర నిర్మాణానికి రంగం సిద్ధం చేశారట. ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న నవీన్… కొత్త చిత్ర ప్రకటన పోస్టర్ కూడా సిద్ధం అయినట్లు సమాచారం.

Also Read: బిగ్ బాస్ లీక్: విన్నర్, రన్నర్ ఎవరో కూడా తెలిసిపోయింది!

అలాగే సత్యదేవ్ , రాజ్ తరుణ్ వంటి హీరోలతో కూడా చిత్రాలు చేయడానికి… మహేష్ మరియు ఆయన టీమ్ సభ్యులు ప్రణాళికలు వేస్తున్నారట. యంగ్ హీరోలతో వరుసగా చిత్రాలు మహేష్ తన బ్యానర్ లో నిర్మించనున్నారట. మహేష్ వైఫ్ నమ్రత కూడా ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అలా మహేష్ పరిశ్రమ వలన పొందిన ప్రయోజనాలను, సంపదను మరలా పరిశ్రమ అభివృద్ధికి, యువ హీరోల కెరీర్ కోసం ఉపయోగిస్తూ శభాష్ అనిపిస్తున్నారు. మరోవైపు మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో కూడా మహేష్ భాగస్వామిగా ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్