త్రివిక్రమ్ తో సినిమాపై మహేష్ ఆసక్తికర ట్వీట్

కొన్ని కాంబినేషన్లలో వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్లో హీరోలు.. దర్శకుల కాంబినేషన్లలో సినిమా రావడం కొత్తమే కాదు. ఒకే తరహాలో ఆలోచించే దర్శకులు.. హీరోల మధ్య సినిమాలు రావడానికి చాలా ఏళ్లు పడుతుంటాయి. ఈ తరహా వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో చివరగా వచ్చిన ‘ఖలేజా’ నేటితో దశబ్దకాలం పూర్తి చేసుకుంది. Also Read: సుశాంత్ కేసులో ట్విస్ట్: రియా ఊపిరి పీల్చుకో.. […]

Written By: NARESH, Updated On : October 7, 2020 4:27 pm
Follow us on

కొన్ని కాంబినేషన్లలో వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. టాలీవుడ్లో హీరోలు.. దర్శకుల కాంబినేషన్లలో సినిమా రావడం కొత్తమే కాదు. ఒకే తరహాలో ఆలోచించే దర్శకులు.. హీరోల మధ్య సినిమాలు రావడానికి చాలా ఏళ్లు పడుతుంటాయి. ఈ తరహా వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్లో చివరగా వచ్చిన ‘ఖలేజా’ నేటితో దశబ్దకాలం పూర్తి చేసుకుంది.

Also Read: సుశాంత్ కేసులో ట్విస్ట్: రియా ఊపిరి పీల్చుకో..

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో గతంలో రెండు సినిమాలు పట్టాలెక్కాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’. ఈ మూవీని త్రివిక్రమ్ అద్భుతంగా తెరకెక్కించాడు. మహేష్ సరసన త్రిష నటించింది. ఈ మూవీ థియేటర్లలో మాత్రం ఎక్కువగా ఆడలేకపోయినా టీవీల్లో మాత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ‘అతడు’ మూవీ టీవీల్లో వచ్చిన ప్రతీసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు.

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ‘ఖలేజా’. ఈ చిత్రం విడుదలై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా వర్కింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అభిమానులంతా ‘ఖలేజా’ నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. ఈ మూవీలో మహేష్ కు జోడీ అనుష్కశెట్టి నటించింది.

‘ఖలేజా’ మూవీలో నటించడం వల్ల తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోగలిగానని మహేష్ తెలిపాడు. ఇదంతా దర్శకుడు త్రివిక్రమ్ వల్లే సాధ్యమైందని మహేష్ ట్వీట్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో త్వరలోనే ఓ మూవీ రాబోతుందని మహేష్ హింట్ ఇచ్చాడు. దశాబ్దం క్రితం విడుదలైన ‘ఖలేజా’ ప్రభావం ఇంకా ప్రేక్షకులపై ఉండటంతో అభిమానులు కూడా వీరి కాంబినేషన్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు.

Also Read: రచ్చ.. రచ్చ.. అరియానాకు ముద్దు ఇచ్చిన అవినాష్..!

వీరిమధ్య కొద్దిరోజులుగా కథాచర్చలు నడుస్తాయని సమాచారం. దీంతో త్వరలో వీరి మధ్య హట్రిక్ కాంబో సెట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. గత సినిమాల మాదిరిగా కాకుండా ఈసారి మహేష్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట. దీంతో సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని హింట్ ఇవ్వడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.