Mahesh Babu: గుంటూరు కారంపై తేల్చేసిన మహేష్… ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ!

తాజాగా ఈ సినిమా పరిస్థితిపై ఏకంగా మహేష్ బాబునే ప్రశ్నించారు. బిగ్ సి 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు.

Written By: Shiva, Updated On : August 21, 2023 9:30 am

Mahesh Babu

Follow us on

Mahesh Babu: మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఆ సినిమా నిత్యం వార్తల్లో కనిపిస్తుంది. పాజిటివ్ వార్తలు వస్తే ఇబ్బంది లేదు కానీ, గుంటూరు కారం సినిమాకు మొదటి నుంచి నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. ఒకానొక దశలో అసలు సినిమా ఉంటుందా ? ఉండదా ? అనే సందేహాలు కూడా వచ్చాయంటే అర్థం చేసుకోండి ఈ సినిమా పరిస్థితి.

తాజాగా ఈ సినిమా పరిస్థితిపై ఏకంగా మహేష్ బాబునే ప్రశ్నించారు. బిగ్ సి 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో బిగ్ సి కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయినప్పుడు గుంటూరు కారం సినిమా గురించి ప్రశ్నలు రావటంతో “సంక్రాంతి కి సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ హ్యాపీ గా ఉంటారు ” అంటూ ఈ సినిమా విషయంలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. దాదాపు రెండేళ్ల క్రితం ఈ సినిమాను మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని నెలలకు KGF ఫైట్ మాస్టర్స్ తో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించారు. కానీ అది సరిగ్గా రాలేదని భావించి వారిని తప్పించారు. ఆ తర్వాత స్టోరీ బాలేదని దానికి మార్పులు చేర్పులు చేయించారు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో కూడా హీరో సంతృప్తిగా లేడని అతన్ని కూడా తప్పించే అవకాశం ఉందని రూమర్స్ బయటకు వచ్చాయి.

కానీ అలాంటిదేమి జరగలేదు. ఇక మొదటగా ఈ సినిమాలో త్రివిక్రమ్ లక్కీ గర్ల్ పూజా హెగ్డే ను అనుకున్నారు. సెకండ్ లీడ్ లో శ్రీ లీల ను తీసుకున్నారు. పూజ , మహేష్ కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఆమెను తప్పించి సెకండ్ లీడ్ లో ఉన్న శ్రీ లీల ను మెయిన్ హీరోయిన్ గా మార్చి అందుకు తగ్గట్లు స్టోరీని చేంజ్ చేశారు. ఆ తర్వాత సినిమా కెమెరామన్ విషయంలో మార్పులు చేర్పులు జరిగాయి. ఇన్ని అవరోధాలు ఈ సినిమాకు ఎదురుకావడం తో ఒక దశలో గుంటూరు కారం ఉంటుందో ? లేదో అనే అనుమానాలు వచ్చాయి.