Mahesh Babu directors controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన వీలైనంత తొందరగా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెడితే ఇప్పుడు చేస్తున్న వారణాసి సినిమా అతన్ని ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా మార్చే ప్రయత్నం చేస్తుంది… మహేష్ బాబు కెరీర్ స్టార్టింగ్ లో చాలామంది దర్శకులు అతనికి సూపర్ సక్సెస్ లను అందించారు. అందులో కొంతమందికి ఆయన రిపీటెడ్ గా చాన్స్లైతే ఇచ్చాడు. వాళ్ళలో కొంతమంది ప్రూవ్ చేసుకుంటే మరి కొంత మంది మాత్రం అతనికి భారీ ప్లాప్ లను కట్టబెట్టారు. ఇక ఈ క్రమంలోనే పోకిరి సినిమాతో మహేష్ బాబు కి ఇండస్ట్రీ హిట్ ని అందించిన పూరి జగన్నాథ్ తో బిజినెస్ మాన్ అనే సినిమా చేసి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
వీళ్ళిద్దరి కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంది. మహేష్ బాబు అభిమానులు సైతం పూరి జగన్నాథ్ తో సినిమా అంటే సంబరపడిపోతారు. అలాంటిది మహేష్ బాబు పూరి జగన్నాథ్ మీద కోపంతో అతనికి సినిమా చేసే ఛాన్స్ ఇవ్వడం లేదు.
ఇక కొరటాల శివ తో సైతం మహేష్ బాబుకి చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు శ్రీమంతుడు, భరత్ అనే నేను రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను సాధించాయి. అయితే కొరటాల శివ సినిమాల్లో ఆచార్య, దేవర లాంటి సినిమాలతో కొంతవరకు తడబడటంతో మహేష్ బాబు అతనికి ఛాన్స్ ఇస్తాడని అనుకున్నాడు.
కానీ మహేష్ బాబు మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కొరటాల శివతో సినిమా చేసే అవకాశం లేదని చెప్పారట. దాంతో ఆయన ప్రస్తుతం బాలయ్య బాబుతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇలా మహేష్ బాబు తనకు భారీ సక్సెస్ లను అందించిన దర్శకులకు హ్యాండ్ ఇచ్చాడు అంటు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…