Mahesh Babu: కబడ్డీ ప్లేయర్ గా మహేష్… సెంటిమెంట్ రిపీట్ అయితే మరో ఇండస్ట్రీ హిట్!

ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది. నాలుగైదు టైటిల్స్ ప్రచారం కాగా గుంటూరు కారం అంటే టైటిల్ కే యూనిట్ ఫిక్స్ అయ్యారంటున్నారు. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది. దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ కి ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో అతడు, ఖలేజా చిత్రాలకు కలిసి పని చేశారు. 13 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డేతో త్రివిక్రమ్ కి వరుసగా మూడో చిత్రం.

Written By: Shiva, Updated On : May 30, 2023 5:23 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ సిద్ధం అవుతుంది. కృష్ణ జయంతి పురస్కరించుకుని మే 31న మహేష్-త్రివిక్రమ్ చిత్ర టైటిల్ టీజర్ విడుదల చేస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. కృష్ణ కెరీర్లో ఐకానిక్ మూవీగా ఉన్న మోసగాళ్లకు మోసగాడు మూవీ రీరిలీజ్ చేస్తున్నారు. మోసగాళ్లకు మోసగాడు ప్రదర్శించే థియేటర్స్ లో మహేష్ 28వ చిత్ర టైటిల్ టీజర్ ప్రదర్శించనున్నారు. బిగ్ స్క్రీన్ పై గ్రాండ్ గా మహేష్ చిత్ర టైటిల్ టీజర్ ని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయనున్నారు.

కాగా ఈ మూవీలో మహేష్ పాత్రపై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మహేష్ కబడ్డీ ప్లేయర్ గా నటించే అవకాశం కలదంటున్నారు. ఇటీవల విడుదల చేసిన మహేష్ స్టిల్స్ ద్వారా ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పారని అంటున్నారు. గతంలో మహేష్ ఒక్కడు మూవీలో కబడ్డీ ప్లేయర్ గా నటించారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఒక్కడు 2003లో విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే మహేష్-త్రివిక్రమ్ మూవీ రికార్డ్స్ తిరగరాయడం ఖాయం.

ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతుంది. నాలుగైదు టైటిల్స్ ప్రచారం కాగా గుంటూరు కారం అంటే టైటిల్ కే యూనిట్ ఫిక్స్ అయ్యారంటున్నారు. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది. దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్ కి ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో అతడు, ఖలేజా చిత్రాలకు కలిసి పని చేశారు. 13 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. అలాగే హీరోయిన్ పూజా హెగ్డేతో త్రివిక్రమ్ కి వరుసగా మూడో చిత్రం.

2024 సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. శ్రీలీల మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నారు. హీరో మహేష్-త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే పుకార్లు వినిపించాయి. చిత్ర యూనిట్ ఖండించారు. నిర్మాత నాగవంశీ సినిమా అదిరిపోతుంది సోషల్ మీడియా వేదికగా విశ్వాసం ప్రకటిస్తున్నారు.