Koratala Siva- NTR Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మే 20న ఇక రచ్చ రచ్చే !

Koratala Siva- NTR Movie: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఐతే.. ప్రస్తుతం ఆచార్య చిత్ర ప్రచారంలో ఉన్న కొరటాల శివ, మరో వారంలో ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రంపై ఫోకస్‌ పెట్టనున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి అప్‌డేట్‌ ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఉండనున్నట్టు తెలిపారు. అలాగే ఈ ఏడాదిలో చిత్రీకరణను పూర్తి చేసి.. వచ్చే ఏడాది […]

Written By: Shiva, Updated On : April 29, 2022 1:22 pm
Follow us on

Koratala Siva- NTR Movie: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఐతే.. ప్రస్తుతం ఆచార్య చిత్ర ప్రచారంలో ఉన్న కొరటాల శివ, మరో వారంలో ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రంపై ఫోకస్‌ పెట్టనున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి అప్‌డేట్‌ ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఉండనున్నట్టు తెలిపారు.

Koratala Siva- NTR

అలాగే ఈ ఏడాదిలో చిత్రీకరణను పూర్తి చేసి.. వచ్చే ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజునే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని కొరటాల తెలిపారు. మొదట హీరోయిన్‌గా అలియా భట్‌ అనుకోగా ఇంకా కన్ఫర్మ్‌ కాలేదన్నారు. రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకున్న ఆలియా.. తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకుందని టాక్ నడిచింది.

Also Read: Analysis on YCP vs Janasena : జనసేనతో పెట్టుకుంటే అంతేమరీ

మొత్తానికి ఎన్టీఆర్ సినిమాలో అలియా లేనట్టే. అందుకే, ఆలియా భట్ ప్లేస్ లో క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నాను తీసుకున్నారని పుకార్లు పుట్టించారు. ప్రస్తుతం కొరటాల ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్‌ పై కొరటాల క్లారిటీ ఇచ్చాడు.

కొరటాల ఏమి చెప్పాడు అంటే.. ‘నేను స్క్రిప్ట్‌ ని కేవలం ఎన్టీఆర్‌ కు మాత్రమే చెప్పాను. నేను ఇంకా ఏ హీరోయిన్‌ కి కథ చెప్పలేదు. అలాగే ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ని ఫైనలైజ్‌ చేయలేదు అని కొరటాల చెప్పుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు లో రష్మిక నటిస్తోంది అని వస్తున్న పుకార్లలో అసలు వాస్తవం లేదు అని తేలిపోయింది.

NTR Koratala Siva Movie

కాకపోతే, క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నాను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది రష్మిక. అందుకే, ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి.

గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Also Read: Mahesh Babu: మహేశ్ బాబుకు నచ్చని ఆయన సినిమా ఏంటో తెలుసా?

Recommended Videos:

Tags