Devi Sri Prasad: మన సౌత్ ఇండియా లో అద్భుతమైన మ్యూజిక్ ని అందించే ఇద్దరు ముగ్గురు మ్యూజిషియన్స్ లో ఒకరు దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad). ఒకప్పుడు ఈయన మ్యూజిక్ ని అందించిన ఆల్బమ్స్ ఏ రేంజ్ లో సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయో మన అందరికీ తెలిసిందే. ఆ పాటలు ఏజ్ లెస్, ఇప్పటికీ వింటూనే ఉండొచ్చు. అలాంటి ఆల్ టైం క్లాసిక్స్ ని అందించిన లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా తయారైంది. ఆయనకు అవకాశాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, అవకాశం ఇచ్చి, మధ్యలో ఆయన చేత మ్యూజిక్ ని ఆపించేసి , వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకోవడమే ఘోరమైన అవమానకర విషయం. ఇలా ఒకసారి కాదు, రెండు సార్లు జరిగింది. ఆ రెండు సార్లు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే జరగడం గమనార్హం .
అప్పట్లో ‘పుష్ప 2’ మూవీ మ్యూజిక్ అందిస్తున్న సమయంలో , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్యూన్స్ ని దేవిశ్రీ ప్రసాద్ డెలివరీ చేసే విషయం లో చాలా ఆలస్యం చేస్తున్నాడు , మాకు విడుదల విషయం లో జాప్యం జరుగుతుంది అనే ఒకే ఒక్క కారణం తో, దేవి శ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టి తమన్ ని తీసుకొని పూర్తి చేశారు. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ విషయం లో కూడా అదే జరిగింది. ఈ సినిమాకు కేవలం పాటలు మాత్రమే అందించాడు, ఆ పాటలకు ఎంతటి పూర్ రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూశాము. దేవిశ్రీ ప్రసాద్ పని ఇక అయిపోయింది అని అంతా అనుకున్నారు. అంత చెత్తగా ఉన్నాయి పాటలు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఒక రేంజ్ లో దేవిశ్రీ ని ట్యాగ్ చేసి తిట్టడం మొదలు పెట్టారు. చివరి నిమిషం లో ఆయన బిజీ గా ఉన్నాడు , అందుకే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి తమన్ ని పెట్టుకున్నాము అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు.
కానీ అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఒకవేళ తానూ బిజీ గా ఉంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేకపోయుంటే, కచ్చితంగా మనసులో ఎలాంటి మనస్పర్థలు పెట్టుకోకుండా నిన్న జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు హాజరు అయ్యి ఉండేవాడు. కానీ నిన్న ఆయన రాలేదు. కారణం బిజీ గా ఉన్నాడని డైరెక్టర్ హరీష్ శంకర్ కవరింగ్ చేసాడు కానీ, అసలు కారణం తనని మేకర్స్ అవమానించారు అనే బాధ కారణంగానే దేవిశ్రీ ప్రసాద్ రాలేదని అంటున్నారు. కానీ ఈ ఈవెంట్ కి తమన్ రాకపోవడానికి కారణం రీ రికార్డింగ్ వర్క్ చివరి స్టేజిలో ఉండడం వల్లే అని తెలుస్తోంది.