Keerthy Suresh Sensational Comments: ప్రస్తుత తరం లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అందాలను ఆరబోసే హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఈ విషయం లో కొంతమంది అయితే హద్దులు కూడా దాటేశారు. అయితే అందాల ఆరబోత తో పాటు అద్భుతంగా నటించగల టాలెంట్ ఉన్న హీరోయిన్లు కూడా ఉన్నారు. వారిలో ఒకరే కీర్తి సురేష్. నేటి తరం హీరోయిన్స్ లో నేషనల్ అవార్డు ని సొంతం చేసుకున్న ఘనత కేవలం ఒక్క కీర్తి సురేష్ కి మాత్రమే సొంతం. ‘మహానటి’ చిత్రం లో ఆమె పోషించిన పాత్రకు కరగని హృదయం అంటూ ఉండదు. అంత అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కి అదే తరహా పాత్రలు మాత్రం దొరకడం లేదు. ఈమధ్య కాలం లో ఆమె చేసిన ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తూ వచ్చింది.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఎలాంటి పాత్రలు కావాలని కోరుకుంటుందో చెప్పుకొచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్ ఎన్ని సినిమాలు చేసినా , మహానటి లాంటి పాత్ర మాత్రం మరొకటి లేదు. చాలా ఛాలెంజింగ్ గా అనిపించినా ఈ పాత్రకు నాకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇలాంటి పాత్ర కోసమే నేను మళ్లీ ఎదురు చూస్తున్నాను. కానీ ఈమధ్య కాలం లో నాకు ఇలాంటి పాటలు రానందుకు కాస్త బాధగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆమెకు ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ కూడా చెయ్యాలని ఉందట. గతంలో జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే ప్రోగ్రాం కి వచ్చినప్పుడు ఈ కోరిక ని చెప్పుకొచ్చింది. వాస్తవానికి కీర్తి సురేష్ కెరీర్ విలన్ రోల్ తోనే మొదలైంది.
మలయాళం లో ఆమె ‘గీతాంజలి’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె డ్యూయల్ రోల్ లో కనిపించింది , ఒక పాత్ర లో విలన్ గా కనిపించింది. ఇదే సినిమాని తెలుగు లో ప్రియమణి ‘చారులత’ పేరుతో రీమేక్ చేయగా, హిందీ లో బిపాసా బసు ‘ఎలోన్’ అనే పేరుతో రీమేక్ చేసింది. కానీ వీళ్ళెవ్వరూ కూడా కీర్తి సురేష్ యాక్టింగ్ ని మ్యాచ్ చేయలేకపోయారు. ఆ రేంజ్ లో ఆమె విలన్ క్యారెక్టర్ లో రెచ్చిపోయింది. ఇకపోతే ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్ , కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టార్రర్ లో వెంకటేష్ కి జోడీగా నటించబోతుంది. వచ్చే నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.

