Kangana: టాలీవుడ్లో ఏక్నిరంజన్ సినిమాతో పరిచయమై.. బాలీవుడ్లో విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కంగనా రనౌత్. తాజాగా, తన అభిమానులకు ఓ గుడ్న్యూడ్ చెప్పింది ఈభామ ఇటీవల ఆమె ప్రేమలో పడినట్లు తెలిపింది. వచ్చే ఐదేళ్లలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కనాలనుకుంటున్నట్లు పేర్కొంది.ఇటీవలే టైమ్స్ నౌ సమ్మిట్ 2021కు హాజరైన కంగనా.. తాను త్వరలోనే వివాహం చేసుకుంటానని స్పష్టం చేసింది. ఒక తల్లిగా, భార్యగా, నూతన భారతదేశ ఆధునీకరణలో పాల్గొనే వ్యక్తిగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే మిస్టర్ కంగనా రనౌత్ గురించి త్వరలోనే తెలుసుకుంటారని వివరించింది.

కాగా, ఇటీవలే కంగనా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. గతంలోనూ ఉత్తమ నటిగా పలు జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈ క్రమంలోనే ఒక కళాకారిణిగా తాను ఎన్నో అవార్డులు సాధించినట్లు తెలిపింది. వేల అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. కెరీర్ ప్రారంభఇంచిన మొదట్లో విజయం అందుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టాయని తెలిపింది. చివరకు ఇప్పుడు ఆ విజయం నన్ను వరించిందని గర్వంగా చెప్పింది. తన మీద ఇప్పటి వరకు విమర్శలతో విరుచుకుపడిన వారందరికీ ఈ అవార్డు సమాధానం చెబుతుందని పేర్కొంది.
వారి నోళ్లు మూతబడతాయని తెలిపింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. కాగా, ఇటీవల తలైవీ సినిమాతో వచ్చిన కంగనా.. మంచి విజయాన్ని అందుకుంది. జయలలిత బయోపిక్గా తెరకెక్కిన ఈసినిమా మంచి విజయాన్ని సాధించింది. కాగా, ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటి.