Kamal Haasan: ఈసారి అధికార పార్టీతో కలిసి కమల్‌ హాసన్‌ ఇక్కడ నుంచి పోటీ

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో వార్డు, పంచాయతీ స్థాయిలో ప్రజలను కలవాలని ఎంఎన్‌ఎం యోచిస్తోంది. ఇందులో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు పట్టించుకోని సమస్యలు ఉన్నాయి. పార్టీ సీనియర్‌ నాయకుడు తెలిపిన వివరాల ప్రకారం, అట్టడుగు స్థాయి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా దాని ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తోంది. ప్రతీ వార్డు కార్యదర్శికి గూగుల్‌ ఫారమ్‌లో వారి ప్రాంతంలోని ప్రాథమిక సౌకర్యాలపై 25 బైనరీ ప్రశ్నల జాబితాను అందజేస్తామని ప్రతీ నియోజకవర్గంపై స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి ఫీడ్‌బ్యాక్‌ ఉపయోగించబడుతుందని తెలిపాడు.

Written By: Raj Shekar, Updated On : July 25, 2023 2:00 pm

Kamal Haasan

Follow us on

Kamal Haasan: తమిళ సినిమా నటుల్లో రాజకీయ ఆసక్తి ఎక్కువ. అయితే సినిమారంగంలో ఉండి రాజకీయాల్లో సక్సెస్‌ అయిన వారు చాలా తక్కువ. తెలుగు నాట నందమూరి తారకరామానావు. తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి, కన్నడనాట రాజ్‌కుమార్, సుమలత, మహారాష్ట్రలో ఒకరిద్దరు సినిమారంగంలో ఉండి రాజకీయాల్లో ఉన్నారు. మంచి గుర్తింపు వచ్చింది మాత్రం ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధికే. తమిళనాడులో రజనీకాంత్‌ కూడా రాజకీయాలపై ఆసక్తి చూసినా ప్రస్తుత పరిస్థితి చూసి ఆ ఆశను చంపుకున్నారు. ఇక విజయ్‌కాంత్, విజయ్, కమల్‌హాసన్‌ కూడా రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. 2020లో తమిళ సూపర్‌స్టార్‌ కమల్‌హాసన్‌ ఎంఎన్‌ఎం పార్టీ స్థాపించాడు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీతో కలిసి కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..
2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన వానతీ శ్రీనివాసన్‌పై 1,728 ఓట్ల స్వల్ప తేడాతో కమల్‌హాసన్‌ ఓడిపోయారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌కు కోయంబత్తూరు సీటును కేటాయించేందుకు డీఎంకే ఆసక్తి కనబరుస్తోందని ఎంఎన్‌ఎం నేతలు పేర్కొంటున్నారు. కోయంబత్తూరు సౌత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎన్‌ఎం రాష్ట్ర స్థాయి ప్రచారాన్ని ‘మక్కలోడు మైయం’ కమల్‌హాసన్‌ ఆదివారం ప్రారంభించారు.

ప్రజల్లోకి వెళ్లేందుకు..
తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో వార్డు, పంచాయతీ స్థాయిలో ప్రజలను కలవాలని ఎంఎన్‌ఎం యోచిస్తోంది. ఇందులో ఆయా నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు పట్టించుకోని సమస్యలు ఉన్నాయి. పార్టీ సీనియర్‌ నాయకుడు తెలిపిన వివరాల ప్రకారం, అట్టడుగు స్థాయి ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా దాని ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తోంది. ప్రతీ వార్డు కార్యదర్శికి గూగుల్‌ ఫారమ్‌లో వారి ప్రాంతంలోని ప్రాథమిక సౌకర్యాలపై 25 బైనరీ ప్రశ్నల జాబితాను అందజేస్తామని ప్రతీ నియోజకవర్గంపై స్పష్టమైన చిత్రాన్ని పొందడానికి ఫీడ్‌బ్యాక్‌ ఉపయోగించబడుతుందని తెలిపాడు.

కోయంబత్తూర్‌ నుంచి పోటీకి..
ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో కోయంబత్తూరు స్థానం నుంచి పోటీ చేయాలని తమిళ సూపర్‌స్టార్‌ కమల్‌హాసన్‌కు పార్టీ కోయంబత్తూరు జిల్లా కార్యకర్తలు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. ఈమేరకు కమల్‌ కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. డీఎంకే నాయకురాలు కనిమొళి ఆమె నడుపుతున్న బస్సులో ఎక్కారనే వివాదంతో ఉద్యోగం నుంచి తొలగించబడిన తమిళనాడు బస్సు డ్రైవర్‌ షర్మిలకు కమల్‌ హాసన్‌ ఇటీవల కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. కనిమొళిని టికెట్‌ చార్జీలు అడిగిన బస్సు కండక్టర్‌తో షర్మిల వాగ్వాదానికి దిగారు. దీంతో బస్సు యజమాని షర్మిలను నిలదీశాడు. కమల్‌ హాసన్‌ ఆమెను తన చెన్నై ఇంటికి ఆహ్వానించి బతుకుదెరువు కోసం ఆమె నడపగలిగే కొత్త కారును అందజేశారు.

కోయంబత్తూరులో నివాసముంటున్న షర్మిలకు కమల్‌ కారును బహుమతిగా ఇవ్వడం కూడా ఆ ప్రాంతంలో పాపులారిటీ సంపాదించడానికి చేసిన ఎత్తుగడగా కూడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుతో కమల్‌ లోక్‌సభ వరిలో నిలవడం ఖాయమని తమిళ రాజకీయవర్గాలు చెబుతున్నాయి.