మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కొద్ది రోజుల నుంచి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇంటికి వెళ్తున్నా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటున్నాడు. భార్య శ్రీజ, ముద్దులొలికే కూతురు దగ్గరికి కూడా వెళ్లడం లేదు. అదేంటి ఒకో ఇంట్లో ఉంటూ భార్య, పిల్లల దగ్గరకి వెళ్లకపోవడం ఏంటి? కొంపదీసి దంపతుల మధ్య విభేదాలు వచ్చాయా? అనుకుంటున్నారా? అదేం లేదు. ఇది కరోనా కాలం కాబట్టి కళ్యాణ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు.
బీజేపీకి పూర్తి విధేయుడిగా మారిపోయిన బాబు..!
కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం ‘సూపర్ మచ్చి’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు లాక్డౌన్కు ముందే ఈ చిత్రంలో కొంత భాగాన్ని చిత్రీకరించారు. కరోనా కారణంగా మధ్యలో బ్రేక్ వచ్చింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్య లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చి సినిమా షూటింగ్స్కు అనుమతి ఇచ్చాయి. దాంతో, సూపర్ మచ్చి షూటింగ్ను ఇటీవల రామానాయుడు స్టూడియోస్లో తిరిగి ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేయడమే కాకుండా, మిగిలి ఉన్న పాటలను కూడా చిత్రీకరించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
చివరకు రఘురామ కృష్ణం రాజు సాధించింది ఏమిటీ?
మరోవైపు హైదరాబాద్లో కరోనా వైరస్ ఉధృతి రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే టాలీవుడ్కు చెందిన కొంత మంది నటీనటులు కరోనా బారిన పడ్డారు. ఆర్టిస్టులకు వైరస్ సోకడంతో కొన్ని సీరియల్స్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దాంతో, ప్రతి రోజూ షూటింగ్లో పాల్గొంటున్న కళ్యాణ్ దేవ్ తనతో పాటు తన ఫ్యామిలీ గురించి ఆలోచించాడు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కుటుంబం డేంజర్లో పడుతుందని భావించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా స్వీయ నిర్భందం విధించుకున్నారు. బయట షూటింగ్లో పాల్గొని ఇంట్లోకి వెళ్లడం ప్రస్తుత పరిస్థితుల్లో మంచిది కాదని భావించిన మెగా అల్లుడు కుటుంబ సభ్యులెవరనీ కలవకూడదని తీర్మానించుకున్నాడు. షూటింగ్స్కు వెళ్లి వచ్చిన తర్వాత తన ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కడే ఉంటున్నాడట. సూపర్ మచ్చి షూటింగ్తో పాటు అన్ని పనులూ పూర్తయ్యాకే ఇంట్లోకి వెళ్లాలని భావిస్తున్నాడట. ఏదేమైనా మెగా అల్లుడి ముందుజాగ్రత్తకు, ఫ్యామిలీ పట్ల చూపించే శ్రద్ధకు శభాష్ అనాల్సిందే.